ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో మార్పులు చేసింది. వరుణ్ ఆరుణ్, ఆండ్రూ టై తుది జట్టులోకి రాగా.. అంకిత్ రాజ్ పుత్, టామ్ కరన్ బెంచ్కు పరిమితమయ్యారు.. ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది. వరుస ఓటములతో ఓత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఐదు మ్యాచ్లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది. టోర్నీలో ఆదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపుమీదు కనిపిస్తోంది.
రాజస్థాన్ జట్టు: యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, మహిపాల్ లోమ్రర్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, ఆండ్రూ టై, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగి, వరుణ్ ఆరోన్
దిల్లీ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, మార్కస్ స్టాయినిస్, షిమ్రన్ హెట్మైయిర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, కాగిసో రబాడ, ఆన్రిచ్ నార్జె