IPL 2020: ఐపీఎల్ టోర్నీలో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న 17వ మ్యాచ్ కాసేపట్లో ఆరంభం కానుంది. ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. అసలే ఎడారి దేశం.. పైగా మధ్యాహ్నం 03.30కే మ్యాచ్ జరుగుతుండడంతో ఇరుజట్ల ఆటగాళ్లు చెమటోడ్చక తప్పదు. ముంబై ఇండియన్స్ జట్టు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. సన్ రైజర్స్ జట్టులో మాత్రం రెండు మార్పులు చేశారు. గత మ్యాచ్లో గాయపడిన భువనేశ్వర్తో పాటు ఖలీల్ అహ్మద్ స్థానంలో సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్ను జట్టులోకి తీసుకున్నారు.
జట్ల వివరాలు:
ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జాని బెయిర్స్టో (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, టి.నటరాజన్.
పాయింట్ల పట్టికలో ముంబై మూడో స్థానంలో, హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. రెండు జట్లు ఇప్పటి వరకు నాలుగేసి మ్యాచ్లు ఆడి.. చెరి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించాయి.