పాకిస్తాన్లో సైనికులు రెచ్చిపోయారు. సొంత పౌరులపైనే పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్లలోనే కాల్పులకు తెగబడుతున్నారు. మరణాయుధాలతో ఇష్టానుసారం దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజలపై ఆర్మీ ఆగడాలు హద్దు మీరుతున్నాయి. కోహిస్తాన్ మారీ ప్రాంతంలో పౌరులపై పాకిస్తాన్ జవాన్లు కాల్పులు జరుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు మరణించారని బలూచ్ రిపబ్లిన్ పార్టీ ప్రకటించింది. ఆర్మీ దాడుల్లో ఎంతో మంది గాయపడ్డారని పేర్కొంది. అంతేకాదు మహిళలు, చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని బలూచ్ రిపబ్లికన్ పార్టీ నేత షేర్ మహమ్మద్ భుగ్తీ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 9న భారీ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు.
Pakistan military has started a massive operation in the region of Kohistan Marri where gunships are being used on civil populations.
— Sher Mohammad Bugti (@SherM_BRP) February 9, 2021
The deaths of two Marri Balochs have been confirmed, while a large number of women and children have also reportedly been abducted.
పౌరులపై కాల్పులు జరుపడంతో పాటు ఆయుధాలతో చావ బాదుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Pak Army Vs Pakistan.
— News18 (@CNNnews18) February 10, 2021
A video from Dasu Dam in Kohistan shows paramilitary soldiers firing at public & beating them with weapons.@AdityaRajKaul shares more details with @AnushaSoni23 pic.twitter.com/BENWHgZnN8
ایسے بھی کوٸی مارتا ہے بھلا ایسے تو کسی جانور کو بھی نہیں مارتے ہیں اج اپر کوہستان میں رینجرز نے لیبرز پر فائرنگ اور ناروا تشدد کی جس میں 5 افراد شدید زخمی ہوگئے ہیں#kohistan #PTIGovernment #Pakistan #Shame pic.twitter.com/n1VjzhtQnx
— Shahzad Naveed (@Shahzad_Nvd) February 9, 2021
ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్లోని కోహిస్తాన్ జిల్లా దాసు హైడ్రోపవర్ ప్రాజెక్ట్ వద్ద ఈ కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. సింధు నదిపై దాసు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఐతే ఆ డ్యామ్ కోసం భూములను ఇచ్చిన స్థానికులు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. భూములను ఇచ్చి తాము సర్వం కోల్పోయామని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 9న ఆందోళనకారులపై ఆర్మీ కాల్పులు జరిపింది.
బలూచిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎప్పటి నుంచో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. అక్కడి ప్రజలను ఆర్మీ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. దాడులకు పాల్పడుతూ హింసకు పాల్పడుతోంది. అంతర్జాతీయ వేదికగా ఎన్నోసార్లు దీనిపై పలు దేశాలు గళమెత్తాయి. తాజాగా మరోసారి పాక్ ఆర్మీ రెచ్చిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారిని టార్గెట్ చేసి కాల్పులకు పాల్పడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pakistan, Pakistan army