శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ముగ్గురు భారత పౌరులు చనిపోయినట్టు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు. శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో సుమారు 207 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 400 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, చనిపోయిన 207 మందిలో 40మంది విదేశీయులు ఉన్నట్టు సమాచారం. ఈస్టర్ ప్రార్థనల సందర్భంగా చర్చిలను ముష్కరులు టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు ఎనిమిది చోట్ల పేలుళ్లు జరిగాయి. అందులో సూసైడ్ ఎటాక్స్ కూడా ఉన్నాయి. శ్రీలంక విదేశాంగ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం.. పేలుళ్లలో ముగ్గురు చనిపోయారని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. వారి వివరాలను కూడా వెల్లడించారు. లోకాషిని, నారాయణ చంద్రశేఖర్, రమేష్ అనే ముగ్గురు చనిపోయినట్టు శ్రీలంక అధికారులు తెలిపినట్టు చెప్పారు. దీంతోపాటు శ్రీలంక పర్యటనకు వెళ్లిన తమ వారి ఆచూకీ కోసం కంగారుపడే భారతీయుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన హెల్ప్ లైన్ నెంబర్లను వెల్లడించారు. శ్రీలంకలోని భారత హైకమిషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లు.
+94777903082, +94112422788, +94112422789.
Indian High Commission in Colombo has conveyed that National Hospital has informed them about the death of three Indian nationals. Their names are Lokashini, Narayan Chandrashekhar and Ramesh. We are ascertaining further details. /3
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 21, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Columbo Bomb Blast, Sri Lanka, Terror attack