ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన పిల్లలకు సాయం చేయడానికి రష్యన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని వేలం వేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పిల్లలకు సహాయం చేయడానికి యునిసెఫ్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఆదాయం నేరుగా అందుతుంది. 2021 అక్టోబరులో మురాటోవ్ బంగారు పతకాన్ని అందుకున్నారు. స్వతంత్ర రష్యన్ వార్తాపత్రిక నోవాయా గెజిటాను ప్రారంభించడానికి ఆయన సహాయపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన నేపథ్యంలో జర్నలిస్టులపై క్రెమ్లిన్ నిర్బంధం, ప్రజల అసమ్మతి మధ్య మార్చిలో ఆ పత్రిక మూతపడినప్పుడు.. మురాటోవ్ పబ్లికేషన్స్ ఎడిటర్-ఇన్-చీఫ్గా పనిచేస్తున్నారు. మురాటోవ్ తన బహుమతిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు.. దానితో పాటు 500,000 డాలర్ల క్యాష్ ప్రైజ్ను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. శరణార్థులుగా మారిన పిల్లల భవిష్యత్తుకు ఓ అవకాశం ఇవ్వడం కోసం విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అనాథలైన పిల్లల గురించే ఆందోళన
మురాటోవ్ అసోసియేటెడ్ ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉక్రెయిన్లో ఘర్షణల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి తాను ఆందోళన చెందుతున్నానని చెప్పారు. వారి భవిష్యత్తును వారికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రష్యాకు వ్యతిరేకంగా విధించిన ముఖ్యమైన అంతర్జాతీయ ఆంక్షలు అరుదైన వ్యాధులకు మందులు, ఎముక మజ్జ మార్పిడి వంటి మానవతా సహాయాన్ని అవసరమైన వారికి చేరకుండా నిరోధించలేవని ఆయన అన్నారు. ఉక్రేనియన్లకు సహాయం చేయడానికి ప్రజలు తమ విలువైన ఆస్తులను వేలం వేస్తారు కాబట్టి ఇది ఒక ఉదాహరణగా ఫ్లాష్ మాబ్కు నాంది కావాలని మురాటోవ్ తెలిపారు. గతేడాది ఫిలిప్పీన్స్కు చెందిన జర్నలిస్ట్ మరియా రెస్సాతో కలిసి మురాటోవ్ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
మురాటోవ్ 2014లో క్రిమియాను రష్యా చేజిక్కించుకోవడం, ఫిబ్రవరిలో ప్రారంభించిన యుద్ధంపై తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 5 మిలియన్ల మంది ఉక్రేనియన్లు భద్రత కోసం ఇతర దేశాలకు పారిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని ఈ యుద్ధం సృష్టించింది.
గతంలో మురాటోవ్పై దాడి..
ప్రభుత్వ లక్ష్యాలకు సంబంధం లేకపోయినా రష్యాలోని స్వతంత్ర పాత్రికేయులు క్రెమ్లిన్ పరిశీలనలో ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురాటోవ్ వార్తాపత్రికలో పనిచేసిన కనీసం నలుగురి సహా దాదాపు రెండు డజన్ల మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఏప్రిల్లో రష్యా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రెడ్ పెయింట్తో తనపై దాడి జరిగినట్లు మురాటోవ్ చెప్పారు.
మురటోవ్ న్యూయార్క్ నగరానికి తన పర్యటనను ప్రారంభించడానికి గురువారం రష్యా నుంచి పశ్చిమ ఐరోపాకు బయలుదేరారు. అక్కడ ప్రత్యక్ష బిడ్డింగ్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జూన్ 1న ఆన్లైన్ బిడ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం నాటి లైవ్ బిడ్డింగ్ ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున జరుగుతుంది. సోమవారం ఉదయం నాటికి, అధిక బిడ్ 550,000 డాలర్లుగా ఉంటుందని అంచనా. బహుశా మిలియన్ల వరకు కూడా చేరవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
2014లో నోబెల్ విక్రయించిన జేమ్స్ వాట్సన్..
1901లో ఈ బహుమతి ప్రారంభమైనప్పటి నుంచి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం లేదా వైద్యం, సాహిత్యం, శాంతి అభివృద్ధిలో సాధించిన విజయాలను గౌరవిస్తూ నోబెల్ బహుమతులు పొందిన దాదాపు 1,000 మంది గ్రహీతలు ఉన్నారు. 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబుల్ ప్రైజ్ను విక్రయించి అధిక మొత్తం అందుకున్నారు. DNA స్ట్రక్చర్ ఆవిష్కరణలో అందించిన సేవలకుగాను 1962లో అతనికి నోబెల్ బహుమతి దక్కింది. ఆ పతకాన్ని 4.76 మిలియన్ల డాలర్లకు విక్రయించారు. మూడు సంవత్సరాల తరువాత, అతని సహ-గ్రహీత, ఫ్రాన్సిస్ క్రిక్ కుటుంబం, మురాటోవ్ పతకాన్ని వేలం వేస్తున్న అదే సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ ద్వారా వేలం నిర్వహించి 2.27 మిలియన్లను అందుకుంది. మురాటోవ్ మెడల్లో ఉన్న 175 గ్రాముల 23-క్యారెట్ బంగారం విలువ సుమారు 10,000 డాలర్లు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.