హోమ్ /వార్తలు /international /

Russia-Ukraine War : ఉక్రెయిన్ పై వ్యూహం మార్చిన రష్యా !

Russia-Ukraine War : ఉక్రెయిన్ పై వ్యూహం మార్చిన రష్యా !

Russia Changes Strategy On Ukraine : ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు  మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు.

Russia Changes Strategy On Ukraine : ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు  మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు.

Russia Changes Strategy On Ukraine : ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు  మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

    Russia Changes Strategy On Ukraine : ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు  మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్‌ అస్తవ్యస్తమైంది. పలు నగరాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ క్రమంలో రష్యా సైనికులు కూడా భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌ పై సైనిక చర్యలో ఆర్థికంగా, సైనికంగా భారీ నష్టాలు ఎదుర్కొంటున్న రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చింది. రాజధాని కీవ్‌ను వదిలి కొత్త ప్రాంతాలపై దాడులకు దిగింది. ఇప్పటివరకు దాడి చేయని లవీవ్‌ నగరంపై మాస్కో సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడ్డాయి.

    ఇప్పటికే మరియుపోల్‌ తో పాటు వివిధ నగరాలను ధ్వంసం చేసిన రష్యా.. ఇప్పుడు లవీవ్‌ పైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా లవీవ్‌పై క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించినట్లు మాస్కో రక్షణ శాఖ స్వయంగా వెల్లడించింది. లవీవ్‌ సమీపం నుంచి ఉక్రెయిన్ దళాలు ఉపయోగిస్తున్న ఇంధన డిపోను రష్యా సుదూర క్షిపణులతో ధ్వంసం చేసింది. యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌లు, రాడార్ స్టేషన్‌లు, ట్యాంకులను రిపేర్ చేసేందుకు వినియోగిస్తున్న ఓ ప్లాంట్‌పై దాడి చేసేందుకు క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక,తమ ఇంధన స్థావరాలను, ఆహార నిల్వలను.. రష్యా సైన్యం నాశనం చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యాపై దాడికి మరిన్నీ ఆయుధాలు అందించాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేసింది.

    ALSO READ Elon Musk : ట్రంప్ బాటలో ఎలాన్ మస్క్..ట్విట్టర్ కు పోటీగా సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్!

     మరోవైపు,, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరపాలని క్రైస్తవ మత ప్రబోధకుడు పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. రోమ్‌ లోని సెయింట్‌ పీటర్‌ స్క్వార్‌ వద్ద పోప్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. మానవత్వం.. తప్పకుండా యుద్ధానికి ముగింపు పలకాలని, లేకుంటే యుద్ధమే మానవత్వానికి ముగింపు పలుకుతుందని హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించే దశకు చేరుకున్నామని మానవత్వం అర్ధం చేసుకోవాలని సూచించారు. క్రూరమైన, మతిలేని ఈ యుద్ధం కొనసాగితే, అది అందరికీ ఓటమని అన్నారు. యుద్ధం మానవుడిని చరిత్ర నుంచి తొలగించకముందే చరిత్ర నుంచి యుద్ధాన్ని తొలగించాలని పోప్‌ పిలుపునిచ్చారు.

    First published:

    ఉత్తమ కథలు