ఆ చేప ఒడ్డుకొస్తే సునామీ వస్తుందా? జపాన్ ఎందుకు వణికిపోతోంది?
2010లో సుమారు 10 ఓర్ఫిష్లు సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2011 మార్చిలో జపాన్లో భారీ భూకంపం వచ్చింది. సునామీ విధ్వంసానికి సుమారు 19వేల మంది చనిపోయారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని జపాన్ వాసులు భయపడుతున్నారు.
news18-telugu
Updated: February 4, 2019, 6:08 PM IST
news18-telugu
Updated: February 4, 2019, 6:08 PM IST
ఓ చనిపోయిన చేపను చూసి యావత్ జపాన్ వణికిపోతోంది. దాదాపు 11 మీటర్లుండే ఆ చేప... జపాన్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజుల్లో ఇలాంటివి మూడు చేపలు తీరానికి కొట్టుకురావడంతో... జపాన్ ప్రజల్లో ప్రాణభయం మరింత తీవ్రమైంది. భూకంపం విధ్వంసం సృష్టిస్తుందని హడలెత్తుతున్నారు. సునామీ ముంచెత్తుందన్న భయంతో ప్రాణాలరచేత పట్టుకొని జీవిస్తున్నారు. అసలు ఈ చేపకు సునామీకి లింకేటి?
ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ చేప పేరు ఓర్ విష్. సముద్ర పాముగా కూడా పిలుస్తారు. పొడవాటి శరీరం, ఎర్రటి మొప్పులు, వెండిలా మెరిసే చర్మం కలిగి ఉంటుంది. ఈ చేపను సముద్ర దేవుడి దూతగా భావిస్తారు జపాన్ ప్రజలు. ఇవి నీటి అడుగున 200 మీ. నుంచి కిలోమీటర్ లోతన మాత్రమే ఇవి జీవిస్తాయి. అంత అడుగుభాగాన సంచరించడంతో మత్స్యకారుల వలకు అస్సలు చిక్కవు. ఇలాంటిది ఇటీవల ఓర్ఫిష్లు వరుసగా ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. తొయామా తీరంలో రెండు ఓర్ఫిష్లు మత్స్యకారులకు కనిపించాయి. అంతకు ముందు మరో ఐదు చేపలు కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ సీజన్లో మొత్తం ఏడు చేపలు కనిపించాయి.
ఓర్ఫిష్ చేపలు తీరానికి కొట్టుకొచ్చినా...మత్స్యకారుల వలకు చిక్కినా... జపాన్ ప్రజలు భయపడితారు. ఎందుకంటే.. ఇవి తీరానికి వస్తే ఏదో ప్రకృతి విపత్తు సంభవిస్తుందని వాళ్లు విశ్వసిస్తారు. సముద్ర గర్భంలో భూకంపం వస్తే వీటికి ముందే తెలిసిపోతుందట..! సునామీ పరిస్థితులు తలెత్తినా ఓర్ఫిష్ చేపలు పసిగడతాయట..! ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అవి నీటి పైభాగానికి వస్తాయని జపాన్ వాసులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో తీరానికి భారీ చేపలు కొట్టుకురావడంతో.. మళ్లీ సునామీ వస్తుందేమోనన్న భయంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.2010లో సుమారు 10 ఓర్ఫిష్లు సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2011 మార్చిలో జపాన్లో భారీ భూకంపం వచ్చింది. సునామీ విధ్వంసానికి సుమారు 19వేల మంది చనిపోయారు. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని జపాన్ వాసులు భావిస్తున్నారు. ఐతే అధికారులు మాత్రం ఎలాంటి భయాందోళనలు అవసరం లేదంటున్నారు. సునామీ పరిస్థితులు ఆ చేపలకు ముందే తెలుస్తుందన్న ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కొట్టిపారేస్తున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ చేప పేరు ఓర్ విష్. సముద్ర పాముగా కూడా పిలుస్తారు. పొడవాటి శరీరం, ఎర్రటి మొప్పులు, వెండిలా మెరిసే చర్మం కలిగి ఉంటుంది. ఈ చేపను సముద్ర దేవుడి దూతగా భావిస్తారు జపాన్ ప్రజలు. ఇవి నీటి అడుగున 200 మీ. నుంచి కిలోమీటర్ లోతన మాత్రమే ఇవి జీవిస్తాయి. అంత అడుగుభాగాన సంచరించడంతో మత్స్యకారుల వలకు అస్సలు చిక్కవు. ఇలాంటిది ఇటీవల ఓర్ఫిష్లు వరుసగా ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. తొయామా తీరంలో రెండు ఓర్ఫిష్లు మత్స్యకారులకు కనిపించాయి. అంతకు ముందు మరో ఐదు చేపలు కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ సీజన్లో మొత్తం ఏడు చేపలు కనిపించాయి.
ఓర్ఫిష్ చేపలు తీరానికి కొట్టుకొచ్చినా...మత్స్యకారుల వలకు చిక్కినా... జపాన్ ప్రజలు భయపడితారు. ఎందుకంటే.. ఇవి తీరానికి వస్తే ఏదో ప్రకృతి విపత్తు సంభవిస్తుందని వాళ్లు విశ్వసిస్తారు. సముద్ర గర్భంలో భూకంపం వస్తే వీటికి ముందే తెలిసిపోతుందట..! సునామీ పరిస్థితులు తలెత్తినా ఓర్ఫిష్ చేపలు పసిగడతాయట..! ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అవి నీటి పైభాగానికి వస్తాయని జపాన్ వాసులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో తీరానికి భారీ చేపలు కొట్టుకురావడంతో.. మళ్లీ సునామీ వస్తుందేమోనన్న భయంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.2010లో సుమారు 10 ఓర్ఫిష్లు సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2011 మార్చిలో జపాన్లో భారీ భూకంపం వచ్చింది. సునామీ విధ్వంసానికి సుమారు 19వేల మంది చనిపోయారు. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని జపాన్ వాసులు భావిస్తున్నారు. ఐతే అధికారులు మాత్రం ఎలాంటి భయాందోళనలు అవసరం లేదంటున్నారు. సునామీ పరిస్థితులు ఆ చేపలకు ముందే తెలుస్తుందన్న ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కొట్టిపారేస్తున్నారు.
Loading...