దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికవడం నరేంద్ర మోదీ అదృష్టం కాదు... అది దేశ ప్రజల అదృష్టం అంటూ ప్రశంసలతో ముంచెత్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన అధ్యక్షుడు అయినప్పటి నుంచీ భారత్ విషయంలో కాస్త సానుకూలంగానే ఉంటున్న ట్రంప్... లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయంపై తాజాగా స్పందించారు. ఈ విషయంపై మోదీకి కాల్ చేసి మాట్లాడానన్న ట్రంప్... మోదీ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ... కంగ్రాట్స్ చెప్పానన్నారు. నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి అన్న ట్రంప్... దేశ ప్రజలకు సరిగ్గా కావాల్సిన నేత ఆయనే అన్నారు. అలాంటి నేతను కలిగివుండటం దేశ ప్రజల అదృష్టం అన్నారు. మొత్తానికి బీజేపీ విజయాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నాయి.
Just spoke to Prime Minister @NarendraModi where I congratulated him on his big political victory. He is a great man and leader for the people of India - they are lucky to have him!
ఈ విజయంతో బీజేపీ కొత్త ప్రభుత్వం మరింత శక్తిమంతం అవ్వబోతోంది. తద్వారా ఉపఖండంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం. అందువల్ల పక్క దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటివి చైనా లాంటి దేశాలకు దగ్గరై... కుట్రలు పన్నేందుకు వెనకాడే అవకాశాలున్నాయి. అలాకాదని ఎక్స్ ట్రాలు చేస్తే, భారత్ బలంగా వ్యతిరేకిస్తూ... అంతర్జాతీయ స్థాయిలో తన వాయిస్ వినిపించేందుకు అవకాశాలు మెరుగయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.