ప్రపంచ వ్యాప్తంగా క్రీడా అభిమానులు ఉర్రూతలు ఊగించిన ఒలింపిక్స్ పోటీసులు ముగిసాయి.. అసలు ఈ భూమ్మీద అతిపెద్ద క్రీడా పోటీల సంబరం ఏదంటై ఠక్కున గుర్తొచ్చేది ఒలింపిక్స్. అలాంటి ఒలిపింక్స్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020 పోటీలు 2021లో సాదాసీదాగా జరిగాయి. భారత కూడా ఈ సారి ఓ బంగారు పతకంతో మెరిసింది. అది కూడా వందేళ్ల భారతీయుల కల తీరుస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో తొలి గోల్డ్ మెడల్ సాధించి.. నీరజ్ చోప్రా భారతదేశ గర్వ పడేలా చేశాడు.. వివిధ దేశాల క్రీడాకారులు సత్తా చాటిన పతకాలు సొంతం చేసుకున్న విజయానందంతో తమ స్వదేశాలకు చేరుకున్నారు. ఆదివారంతో క్రీడా పోటీలు ముగిశాయి. అయితే ఇప్పుడు మరో ఒలింపిక్స్ వార్త వైరల్గా మారింది. ఇన్నాళ్లు భూమ్మీద ఒలింపిక్స్ చూశారు ఇప్పుడు అంతరిక్షంలో కూడా పోటీలు జరిగాయి చూస్తారా అంటూ ఆ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. చాలా ఫన్నీ గా గేమ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీడియో వైరల్ అయ్యింది..
వ్యోమగాములు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో పలు పోటీలు సరదాగా ఆడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వారి ఆటలు చూస్తుంటే తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. జిమ్నాస్టిక్స్, ఈత, నో హ్యాండ్బాల్, వెయిట్లెస్ షార్ప్ వంటి ఆటలు ఆడేందుకు తెగ పాట్లు పడుతున్నారు. వారి పాట్లు మనకు హాస్యం పంచుతున్నారు. జీవో గ్రావిటీలో నాలుగు రకాల ఆటలు ఆడారు.
బాల్ను పట్టుకునేందుకు.. జంప్స్ చేసేందుకు పడుతున్న కష్టాలు సరదాగా ఉన్నాయి. ఆస్ట్రోనాట్స్ కూడా సరదాగా నవ్వుతూ ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్ థామస్ పెక్క్వెట్ తెలిపారు. అచ్చం భూలోకంలో జరిగినట్టు ఈ ఒలింపిక్స్ వేడుకల ముగింపు కార్యక్రమం కూడా నిర్వహించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Olympics, Space, World news