హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

India China border: ఎల్​ఏసీ వద్ద చైనాకు ధీటైన జవాబివ్వడానికి సిద్ధమవుతున్న భారత్​.. అధునాతన ఆయుధాలతో బలగాల మోహరింపు..

India China border: ఎల్​ఏసీ వద్ద చైనాకు ధీటైన జవాబివ్వడానికి సిద్ధమవుతున్న భారత్​.. అధునాతన ఆయుధాలతో బలగాల మోహరింపు..

భారత్-చైనా సరిహద్దు (ప్రతీకాత్మక చిత్రం)

భారత్-చైనా సరిహద్దు (ప్రతీకాత్మక చిత్రం)

ఎల్ఐసీ వద్ద సైనిక మౌలిక సదుపాయాలను చైనా పెంచుతున్నప్పటికీ భారత్​ వెనకబడలేదు. సైనిక అధికారుల లెక్కల ప్రకారం.. ఎల్ఏసీ వద్ద దాదాపు 50 వేల నుంచి 60 వేల వరకు భారత్​ అదనపు దళాలు మోహరించాయి.

భారత్ (India)​, చైనా (china) సరిహద్దుల్లో  (borders) గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే శీతాకాలం (winter) అత్యంత గడ్డు పరిస్థితులు ఎదర్కొవాల్సి రావచ్చు. ఎందుకంటే 13వ రౌండ్​లో కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు (Corps Commander-level talks) విఫలం అయ్యాయి. దీంతో ఎల్​ఏసీ వద్ద పెరిగిన ఉద్రిక్తతలు పెరిగాయి. హాట్ స్ప్రింగ్స్ (Hot Springs) నుంచి వైదొలగడానికి చైనా నిరాకరించడంతో శీతాకాలంలో సవాళ్లు ఎదురు కానున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భారత్​ LAC వద్ద ముఖ్యంగా లడక్‌ (Ladakh)లో మౌలిక సదుపాయాలను పెంచుతోంది.

అధునాతన ఆయుధాలతో..

అధునాతన ఆయుధాల (weapons)తో ఆర్మీ (army) సన్నద్ధమైతోంది. ముఖ్యంగా లేటెస్ట్ ఫిన్నిష్ సాకో స్నిపర్ రైఫిల్స్ (LATEST FINNISH SAKO SNIPER RIFLES), ఇజ్రాయెల్​ నెగెవ్ లైట్ మెషిన్ గన్స్ (ISRAELI NEGEV LIGHT MACHINE GUNS), ది అమెరికన్ సిగ్ సౌర్ అసోల్ట్ రైఫిల్స్ (THE AMERICAN SIG SAUER ASSAULT RIFLES), సమకాలీన డ్రోన్లు, K9 వజ్ర T గన్స్, M777 అల్ట్రా-లైట్ హౌవిట్జర్స్ (ULH) అందుబాటులో ఉంచుకుంది. అయితే ఎల్​ఏసీ వద్ద కఠినమైన భూభాగం (harsh terrain), తీవ్ర ఎత్తు, తక్కువ ఉష్ణోగ్రతల (sub-zero temperatures) తో జవాన్లకు సవాళ్లు ఎదురు కానున్నాయి.


శీతాకాలంలో సరిహద్దు భద్రతపై భారత్​ వ్యూహాలు ఎలా ఉన్నాయంటే..

ఎల్​ఏసీ వద్ద సైనిక మౌలిక సదుపాయాలను చైనా పెంచుతున్నప్పటికీ  (ramping up military infrastructure) భారత్​ వెనకబడలేదు. సైనిక అధికారుల లెక్కల ప్రకారం.. ఎల్ఏసీ వద్ద దాదాపు 50 వేల నుంచి 60 వేల వరకు భారత్​ అదనపు దళాలు మోహరించాయి. స్ట్రైక్ కార్ప్స్ (strike corps) తో సహా ఇప్పటికే ఉన్న కొన్ని నిర్మాణాలను భారత సైన్యం పునర్వ్యవస్థీకరించింది. తూర్పు లడక్ ఎత్తైన ప్రదేశాలలో K9 వజ్ర T గన్స్ రెజిమెంట్ మోహరించింది. LAC వెంట వివిధ ప్రదేశాలలో M777 ULH గల 3 రెజిమెంట్‌లు మోహరించింది. మరోవైపు 2021 చివరి నాటికి నాలుగో అల్ట్రా లైట్ హోవిట్జర్ (ULH) రెజిమెంట్ ను పెంచే అవకాశం ఉంది. ఫ్రంట్‌లైన్ దళాలకు ఇప్పటికే అమెరికన్ సిగ్ సౌర్ అస్సాల్ట్ రైఫిల్స్ అందించారు. భారత్​ అదనపు తిరుగుబాటు దళాలు, అదనపు పదాతి దళ బ్రిగేడ్ల అదనపు విభాగాన్ని కూడ చేర్చింది. చైనీస్ ఆయుధ నిర్మాణాలను పోలిన ట్యాంకులు, తుపాకులతో బహుళ సాయుధ , యాంత్రిక యూనిట్లు మోహరించాయి.


భారతదేశ సరిహద్దు నిర్మాణం వద్ద ITBP (Indo-Tibetan Border Police) ప్రణాళికలేంటంటే..


  • 10,000 మంది అదనపు జవాన్లను నియమించడానికి ఐటీబీపీ సమాయత్తం

  • లడక్ ప్రాంతంలో ఖాళీగా ఉన్న అన్ని ఖాళీలు భర్తీ చేసిన ITBP

  • చాలా సంఖ్యలో వైద్యులు, పారామెడికల్​ సిబ్బందిని తూర్పు లడఖ్ మరియు LAC వెంబడి ప్రదేశాలకు పంపిన ITBP

  • ఎల్ఐసీ వద్ద దళాలు ఏర్పాటు చేయడానికి భారీగా జరుగుతున్న ఏర్పాట్లు

  • పెద్ద మొత్తంలో రేషన్‌ను నిల్వ చేయడానికి లడక్ ప్రాంతంలో గిడ్డంగుల సంఖ్యను పెంచిన ఐటీబీపీ



సరిహద్దును పెంచుకునేందుకు చైనా, ఇండియా పోటీ


  • చైనా దాదాపు 3 పదాతిదళ విభాగాలను, 6 నుంచి 8 సంయుక్త ఆయుధ దళాలను ఏర్పాటుచేసినట్లు సమాచారం

  • తూర్పు లడక్‌లో LAC కి దగ్గరగా దాదాపు 450 ట్యాంకులు, పెద్ద సంఖ్యలో ఫిరంగి తుపాకులను మోహరించినట్లు వార్తలు

  • ఇప్పటికే 3 వైమానిక స్థావరాలలో మోహరించి, వేగంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న PLA (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) వైమానిక దళం

  • LAC కి దగ్గరగా హెలిప్యాడ్‌లతో పాటు టిబెట్ అటానమస్ రీజియన్‌ (Tibet Autonomous Region) లో చైనా ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మిస్తున్నట్లు సమాచారం

  • PLA తన దళాల కోసం కొత్త మాడ్యులర్ కంటైనర్ ఆధారిత వసతులను కూడా నిర్మించినట్లు వార్తలు.

  • 2020 నుంచి LAC కి దగ్గరగా తన సరిహద్దు మౌలిక సదుపాయాలను పెంచుకున్న భారత్.

  • బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ద్వారా లడక్‌లో 5 ప్రధాన రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ఇండియా.

  • LAC కి దగ్గరగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో బహుళ రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్.

  • LAC వద్ద మోహరించిన వేలాది మంది బలగాల పోషణ కోసం సైన్యం మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరుస్తున్న భారత్​


' isDesktop="true" id="1060560" youtubeid="qqk6TYV2WME" category="international">

భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన

ఏప్రిల్ 2020 నుంచి తూర్పు లడక్‌లో భారత్,​‌‌‌‌ చైనాల మధ్య సైనిక వివాదం నడుస్తోంది. పాంగాంగ్ త్సో సమీపంలో భారత గస్తీని చైనా నిలిపివేసిన తర్వాత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 2021 లో పాంగోంగ్ త్సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి భారత్​,  చైనా సైనికులు విరమించుకున్నాయి. వ్యూహాత్మకంగా ఉన్న డెప్‌సాంగ్ మైదానాలలో భారత గస్తీకి PLA అవరోధాలు సృష్టిస్తోంది. అయితే చైనా PLA సెప్టెంబర్ 2021 లో ఉత్తరాఖండ్ బారాహోటి సెక్టార్‌లోని LAC ని అతిక్రమించింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్​ మరియు చైనా సైనికుల మధ్య ఘర్షణ సైతం చోటుచేసుకుంది. మరోవైపు అక్టోబర్ 10 న రెండు దేశాల మధ్య 13 వ రౌండ్ చర్చలు సైతం విఫలం అయ్యాయి.

First published:

Tags: Army, China, India, India-China, Infrastructure

ఉత్తమ కథలు