China - Covid 19 : చైనా తుమ్మితే ప్రపంచానికి కరోనా సోకుతుందనే విషయం ఆల్రడీ ఓసారి రుజువైంది. ఇప్పుడు అది రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. గత వారం నుంచి ఆ దేశంలో కొత్త కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా 40,052 వేల కొత్త కేసులు నమోదవ్వడంతో.. చైనాలో కరోనా తీవ్ర స్థాయిలో ఉందనే విషయం అర్థమైపోతోంది. ఇప్పుడు మరో సమస్య ఏంటంటే.. అది మళ్లీ ఇతర దేశాలకు విస్తరిస్తుందా అనే భయాలున్నాయి. డ్రాగన్ ప్రభుత్వం.. లాక్డౌన్, క్వారంటైన్ వంటివి విధిస్తున్నా.. కరోనా పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఒమైక్రాన్ వేరియంట్ (Omicron strain) వల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో... అతి పెద్ద క్వారంటైన్ క్యాంప్ (quarantine camp) ని నిర్మిస్తున్నారు. ఇందులో ఒకేసారి 90వేల మందిని ఐసోలేషన్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోని ఇక్కడ చూడండి
కరోనాను పూర్తిగా పోగొట్టేవరకూ ఆంక్షలు ఉంటాయని ప్రకటించిన చైనా ప్రభుత్వం జీరో-కోవిడ్ పాలసీని అమల్లోకి తెచ్చి.. కఠిన ఆంక్షలు విధించడంతో.. రాజధాని బీజింగ్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు జిన్ పింగ్.. పదవి నుంచి దిగిపోవాలని నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ వీడియోని ఇక్కడ చూడండి
Protests in China are not rare. What *is* rare, are multiple protests over the same issue, at the same time, across the country. The protest below, apparently in central Beijing’s liangmaqiao, is astounding #China #protests pic.twitter.com/UHJCqqF1YG
— Tom Mackenzie (@TomMackenzieTV) November 27, 2022
China ???????? Protests are erupting across China as people have had enough of the draconian zero Covid lockdowns. This is what eventually happens when people power mobilises against oppressive governments that take away freedoms and human dignity. pic.twitter.com/NsZgZTxEYT
— James Melville (@JamesMelville) November 27, 2022
ఈ ఆందోళనలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. ప్రజల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవాలని కోరింది. "చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం అరుదు.. కానీ అవి జరుగుతున్నాయి. దీన్ని ప్రపంచ దేశాలు లెక్కలోకి తీసుకోవాలి. వాళ్లు కాకపోయినా.. నా అభిప్రాయం ప్రకారం చైనా ప్రభుత్వమైనా వీటిని పరిగణన లోకి తీసుకోవాలి" అని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి జేమ్స్ క్లెవెర్లీ సోమవారం తెలిపారు. "చైనా ప్రభుత్వ ఆంక్షలపై ప్రజలు సంతోషంగా లేరు" అని ఆయన అన్నారు.
Bandi Sanjay : పాదయాత్ర ప్రారంభం.. నేడు భైంసా శివారులో బహిరంగ సభ
ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు ఎత్తేశాయి. ఆ దేశాల్లో కరోనా కూడా దాదాపు పోయింది. కానీ ఆంక్షలు ఏమాత్రం ఎత్తేయని చైనాలో మాత్రం కరోనా తగ్గలేదు. ఇదే ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యపరుస్తోంది. డ్రాగన్ కూడా ఆంక్షలు ఎత్తివేసి ఉంటే.. కరోనా పోయేదేమో అనే అభిప్రాయం ఉంది. ఏదేమైనా ఇప్పుడు చైనా వల్ల ప్రపంచ దేశాలకు కరోనా ముప్పు కనిపిస్తోంది. అసలే ఆర్థిక మాంద్యం వైపు దేశాలు అడుగులు వేస్తున్న సమయంలో.. ఈ కరోనా మీద పడితే.. పెద్ద సమస్యే అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Corona, Covid -19 pandemic