BLASTS TARGETING AFGHAN SCHOOL IN KABUL KILL 30 INJURES 50 VB
Kabul Blast: ఆఫ్ఘనిస్థాన్ లో మరోసారి బాంబుల మోత.. ఈ ఘటనకు పాల్పడింది ఆ సంస్థేనా..!
ప్రతీకాత్మక చిత్రం
Kabul Blast: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ లో వరుసగా బాంబు పేళుళ్లతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అక్కడ ఓ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనలో 30 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ లో బాంబు పేలుళ్లు మరోసారి కలకలం రేపాయి. అఫ్గాన్ లో అధికంగా నివసించే షియాలు ఉండే ప్రాంతంలోని ఓ బాలికల పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో బాలికలు పాఠశాల నుంచి ఇళ్లకు బయలుదేరుతున్నారు. మొదట కార్ బాంబు పేలింది. తర్వాత రెండు రాకెట్లను పేల్చారు. ఈ దాడిలో చనిపోయిన 30 మందిలో ఎక్కువగా యువతే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్ నాజరి తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని అఫ్గాన్ మంత్రి తారీఖ్ అరియాన్ తెలిపారు. అయితే, అంబులెన్సులను అడ్డుకుని ప్రజలు దాడులకు తెగబడ్డారని దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్ నాజరి అన్నారు. వారిని సముదాయించి అంబులెన్సులు వెళ్లేలా చేశామన్నారు.
కాగా, ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఈ దాడులు జరిపింది తాము కాదంటూ తాలిబన్ ప్రకటించింది. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించగా వారికి రక్తదానం చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇటీవల ఐసిస్ బాంబు పేలుళ్లతో విరుచుకుపడుతోంది. మైనారిటీ షియాలపై ఉగ్ర సంస్థ ఐసిస్ బాంబులనుపేల్చగా చాలా మంది చనిపోయారు . ఇటువంటి నీచమైన చర్యలకు ఐసిస్ మాత్రమే పాల్పడుతుందని తాలిబన్ ప్రకటించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.