ఆఫ్రికా దేశం సోమాలియాలో భారీ పేలుడు చోటుచేసుకుంది. సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 73 మంది చనిపోయారు. 73 మంది మృతదేహాలను గుర్తించినట్లు మేయర్ ఒమర్ మహమూద్ తెలిపారు. మృతుల్లో చాలా మంది స్థానిక యూనివర్శిటీకి చెందిన విద్యార్థులేనని చెప్పారు. మరో వంద మంది వరకు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొగదిషులో ఎంతో రద్దీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఈ పేలుడు జరిగింది. ఇక్కడి పన్ను వసూలు కేంద్రం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడిని సోమాలియ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అమాయక ప్రజలపై ఉగ్రవాదులు ఇలాంటి దాడులు చేయడం సరికాదంటున్నారు.
#BREAKING: Several people are believed to have died in a bomb attack at a security checkpoint on the outskirts of Mogadishu, Somalia. pic.twitter.com/lMbwOrii34
— I.E.N. (@BreakingIEN) December 28, 2019
UPDATE: Most of the dozens of people killed in today’s car bomb attack in #Somalia were university students according to Mogadishu mayor @OFilish who spoke to the media. pic.twitter.com/ezhJwimKLb
— Farhan Jimale (@farhanjimale) December 28, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, Terror attack, Terrorists