హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

విమాన ప్రమాదంలో 165 మంది దుర్మరణం... మృతుల్లో నలుగురు భారతీయులు

విమాన ప్రమాదంలో 165 మంది దుర్మరణం... మృతుల్లో నలుగురు భారతీయులు

ఇథియోపియా ఎయిర్ లైన్స్ సీఈఓ  (AP Photo)

ఇథియోపియా ఎయిర్ లైన్స్ సీఈఓ (AP Photo)

Ethiopian Airlines Crash : ఇథియోపియా విమాన ప్రమాదంలో నలుగురు భారతీయులు కూడా చనిపోయినట్లు ఇథియోపియా ఎయిర్‌లైన్స్ తెలిపింది.

    ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచీ బయలుదేరిన వెంటనే కూలిపోయిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమాన ప్రమాదంలో మొత్తం 157 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందీ చనిపోయారు. వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. మొత్తం 35 దేశాలకు సంబంధించిన ప్రయాణికులంతా చనిపోవడం అత్యంత విషాదకరం. 2018 అక్టోబర్‌లో ఇండొనేసియాలో లయన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఇలాంటి బోయింగ్ మోడల్ విమానమే కూలిపోయింది. కెన్యా రాజధాని నైరోబీకి వెళ్లాల్సిన ఇథియోపియా విమానం... టేకాఫ్ అయిన ఆరు నిమిషాలకే కూలిపోయింది. బోయింగ్ తయారు చేసిన 737 మాక్స్ 8 మోడలైన ఆ విమానం కొన్ని నెలల కిందటే సేవలు ప్రారంభించింది.


    విమాన మృతుల్లో నలుగురు భారతీయులు ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధృవీకరించారు. వైద్య పన్నగేశ్ భాస్కర్, వైద్య హన్సిన్ అన్నగేశ్, నూకవరపు మనీష, శిఖా గార్గ్‌ అని సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు తగిన సాయం, మద్దతు అందించాలని ఇథియోపియాలోని భారత హై కమిషనర్‌ను కోరినట్లు ఆమె ట్విటర్‌లో తెలిపారు.




    మృతుల్లో ఒకరైన శిఖా గార్గ్ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్నారు. ఆమె నైరోబీలో జరగాల్సిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు ఫోర్త్ సెషన్‌కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ప్రమాదంలో చనిపోయారని సుష్మా స్వరాజ్ ప్రకటించారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ శిఖ గార్గ్ మృతి దురదృష్టకరమని, ఆమెతో పాటు ఇతర ప్రయాణీకుల మృతికి తన సంతాపం ప్రకటించారు.




    ఇథియోపియా విమాన ప్రమాదంలో చనిపోయిన నూకవరపు మనీషా స్వస్థలం గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు. నూకవరపు వెంకటేశ్వరరావు, భారతి దంపతుల రెండో కూతురు మనీషా. గుంటూరు మెడికల్ కాలేజీలో నాలుగేళ్ల కిందట ఆమె మెడిసిన్ చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మనీషా అక్క లావణ్య నైరోబీలో ఉంటున్నారు. 10 రోజుల కిందట లావణ్య ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చారు. వారిని చూసేందుకు మనీషా బయలుదేరారు. అమెరికా నుంచి ఇథియోపియా వెళ్లి, అక్కడి నుంచీ నైరోబీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మనీషా తల్లిదండ్రులు నెలరోజులుగా లావణ్య దగ్గరే ఉంటున్నారు.


    విమాన ప్రమాదానికి కారణాలు తెలియలేదు. దీనిపై ఇథియోపియా ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. విమానం బయలుదేరగానే కొన్ని ఇబ్బందులు తలెత్తాయని పైలట్ చెప్పగా, విమానాన్ని తిరిగి అడిస్ అబాబాకు మళ్లించాలని కోరినట్లు ఇథియోపియా ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతలోనే ప్రమాదం జరిగిపోయింది. భూమిపై కూలగానే మంటలు చెలరేగడం వల్ల ప్రయాణికులంతా చనిపోయారని తెలిపింది.


     


    ఇవి కూడా చదవండి :


    పశ్చిమాన మొదలై తూర్పున ముగిసే పోలింగ్ దశలు... ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కలిసొస్తాయా?


    ఈసారి ఎన్నికల్లో కొత్తదనం ఏముంది? కొత్తగా ఏ రూల్స్ తెచ్చారు?


    టీడీపీ - వైసీపీ ... ఏ పార్టీ పథకాలు గొప్పవి ... విజయం ఎవరిది?


    Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా... లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి

    First published:

    Tags: Plane Crash, World

    ఉత్తమ కథలు