గతేడాది.. అంటే 2020 మొత్తం కరోనాపాలైంది. ఏడాది అంతే చేధు అనుభావాలే.. కరోనా మహమ్మారి ఇస్రో పైనా ప్రభావం చూపించింది. ఆ చేదు అనుభవాలను అధిగమించి 2021లో సరికొత్త అడుగులేసేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక వైపు చంద్రయాన్ –3, ఆదిత్య –ఎల్ 1, గగన్యాన్కు ఇలా వరస ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా వాణిజ్యపరమైన ప్రయోగాలు చేసేందుకు పక్కా ప్లాన్తో ముందు అడుగులు వేస్తోంది.
తాజా ప్రయోగం పీఎస్ఎల్వీ సీ – 51 ఉపగ్రహ వాహకనౌకను ఆదివారం ఉదయం 10.24కు కు నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి 25 గంటల ముందుగానే కౌంట్డౌన్ ప్రారంభమై కొనసాగుతోంది. అయితే ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా–01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించాక పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగం కావడం దీని ప్రత్యేకత.
ఈ రాకెట్ను పీఎస్ఎల్వీ డీఎల్గా పిలుస్తారు. ఈ తరహాలో ఇది మూడో ప్రయోగం. రాకెట్ లో ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండడంతో దీన్ని రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో నిర్వహించనున్నారు. ఇక నాలుగో దశలో రెండుసార్లు మండించి 18 ఉపగ్రహాలను రెండుసార్లుగా సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు. రాకెట్లోని మొదటి దశ 1.49 నిమిషం పూర్తికాగానే, 2.42 నిమిషాలకు నాలుగో దశలో ఉపగ్రహాలను అమర్చిన హీట్షీల్డ్ విడిపోతుంది. తరువాత రెండో దశ 4.22 నిమిషాలకు, మూడో దశ 8.15 నిమిషాలకు పూర్తయి 16.36 నిమిషాలకు నాలుగో దశ కటాఫ్ అవుతుంది. తరువాత 17.23 నిమిషాలకు బ్రెజిల్కు చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా –01 ఉపగ్రహాన్ని భూమికి 537 కిలోమీటర్లు ఎత్తులోని సన్సింక్రనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు.
మధ్యాహ్నం 01 గంట 01 నిమిషం 9 సెకెన్లకు పీఎస్–4ను రీస్టార్ట్ చేసి సరిగ్గా 18 సెకెన్ల తరువాత కటాఫ్ చేస్తారు. మళ్లీ రెండోసారి34 సెకెన్ల తరువాత రీస్టార్ట్ చేసి 01 గంట 52 నిమిషాలకు కటాఫ్ చేస్తారు. మరో 32 సెకెన్ల తరువాత యూఎస్ చెందిన స్పేస్బీస్ శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్–1 నానోకాంటాక్ట్–2 అనే మరో ఉపగ్రహాన్ని కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని సన్సింక్రనస్ అర్బిట్లో ప్రవేశపెడతారు. సరిగ్గా 1 గంట 55 నిమిషాల 7సెకెన్లకు భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన ఉపగ్రహాలు సతీష్ ధవన్శాట్, సింధునేత్ర, వివిధ రకాల యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన యూనిటీశాట్లో భాగంగా ఉన్న శ్రీశక్తిశాట్, జిట్శాట్, జీహెచ్ఆర్సీ ఈశాట్ అనే ఐదు ఉపగ్రహాల శ్రేణిని అంతరిక్ష కక్ష్యలోకి వదిలిపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేసుకున్నారు. మొదటి ప్రయోగవేదిక నుంచి 39వ ప్రయోగం కాగా, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 78వది, పీఎస్ఎల్వీ సిరీస్లో 53వ ప్రయోగం ఇది.
అయితే ఈ ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్ కే.శివన్ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో తిరుమలలో వెంకన్న స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వా చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.
ఇది కూడా చదవండి: Weekly Horoscope: వారఫలాలు... ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 వరకు రాశి ఫలాలు
అమోసేనియ శాటిలైట్, 18 స్మాల్ శాటిలైట్స్ ను గగన తలంలోకి తీసుకెళ్లనుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఇదే మొదటి మిషన్, మొదటి సారి ఎన్ఎస్ఆయన్ కమర్షియల్ లాంచ్ ఇదని ఆయన కే.శివన్ వివరించారు. స్పేస్ రిఫార్మ్స్ కోసం విద్యార్థులు రూపొందించిన నాలుగు శాటిలైట్స్ కూడా ఉన్నాయని, ఇది చాలా ప్రత్యేకమైన., ముఖ్యమైన మిషన్ అని అన్నారు.