హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Big News: YS వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం..ఆ ఐదుగురికి సీబీఐ కోర్టు సమన్లు!

Big News: YS వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం..ఆ ఐదుగురికి సీబీఐ కోర్టు సమన్లు!

వైఎస్ వివేకానందరెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానందరెడ్డి (ఫైల్ ఫొటో)

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ స్టార్ట్ చేయగా..ప్రధాన, అనుబంధ ఛార్జ్ షీట్ పై నేడు సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ స్టార్ట్ చేయగా..ప్రధాన, అనుబంధ ఛార్జ్ షీట్ పై నేడు సీబీఐ కోర్టు (CBI Court) విచారణ జరిపింది. ఈ క్రమంలో ఐదుగురు నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్,  ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి, శివ శంకర్ రెడ్డిలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరంతా ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Lokesh on Pawan: పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన లోకేష్.. పొత్తులపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీలో న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీత దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ వేసింది. ఇక దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని ఆమె పిటీషన్ లో పేర్కొంది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇటీవల విచారణ జరిపింది. కేసుకు సంబంధించి విచారణపై వివేకా కూతురుకు, భార్యకు అసంతృప్తి ఉందన్న కారణంతో విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి పంపించాలని కోర్టు ఆదేశించింది.

Yuvagalam: యువతకు ప్రత్యేక మానిఫెస్టో.. యువగళం తొలి రోజు లోకేష్ హామీ ఇదే..?

ఈ కేసును త్వరితగతిన, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా తదుపరి దర్యాప్తు కొనసాగాలని కోర్టు సూచించింది. ఈ కేసులో పెద్ద ఎత్తున నిందితులను విచారించాల్సి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ CBIకి పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు న్యాయం జరుగుతుందని మాత్రమే కాదు న్యాయం జరగాలని కోర్టు చెప్పింది. న్యాయం జరగాలనుకోవడం బాధితురాలి యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.

3 ఏళ్లుగా దర్యాప్తు..

వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 3 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శెంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కేసు తెలంగాణ సీబీఐకి బదిలీ చేయడంతో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, CBI, Crime, Crime news, Ys viveka murder case