హోమ్ /వార్తలు /క్రైమ్ /

sad news: పెద్దల పంతానికి మరో ప్రేమజంట బలి -కొండలు, సంధ్య విషాదాంతం

sad news: పెద్దల పంతానికి మరో ప్రేమజంట బలి -కొండలు, సంధ్య విషాదాంతం

మృతులు కొండలు, సంధ్య

మృతులు కొండలు, సంధ్య

వాళ్లిద్దరూ మేజర్లు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కలిసి బతుకుదామనుకున్నారు.. ఈ మేరకు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నం చేశారు.. కానీ వారి ప్రేమను ఇరు కుటుంబాలూ అంగీకరించలేదు.. కలిసి బతకడం కష్టమనుకున్న ఆ జంట.. చావులోనూ తాము ఒక్కటేనని నిరూపించింది..

ఇంకా చదవండి ...

మరో ప్రేమజంట.. పెద్దల పంతానికి బలైపోయింది. కలిసి బతకలేక.. తోడుగా చనిపోయారు. నల్గొండ జిల్లాలో యువ ప్రేమికుల బలవన్మరణం ఘటన అందరినీ కలిచివేసింది. పోలీసులు, గ్రామస్తులు చెప్పిన వివరాలివి.. నల్గొండ జిల్లా అనుముల మండలం తెట్టేకుంటలో జరిగిందీ విషాదకకర సంఘటన.

తెట్టేకుంటకు చెందిన మట్టపల్లి కొండలు (21), అదే గ్రామానికి చెందిన సంధ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. భవిష్యత్తులో పెళ్లితో ఒక్కటయ్యేందుకు ఇరువురూ తమ కుటుంబాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ల ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో..

తమ ప్రేమకు పెద్దల అంగీకారం లేదని, ఇక కలిసి బతకడం కష్టమని భావించిన కొండలు, సంధ్య.. రెండు రోజుల కిందట తెట్టేకుంట సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విగత జీవులుగా పడిఉన్న వాళ్లిద్దరినీ స్థానికులు గుర్తించి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ..

విషం తాగి ఆస్పత్రిపాలైన కొండలు, సంధ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున దాదాపు ఒకే సమయంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతిపై స్నేహితులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Lovers suicide, Nalgonda, Nalgonda police

ఉత్తమ కథలు