హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : కారులో మంటలు..నవదంపతులు సజీవ దహనం

Shocking : కారులో మంటలు..నవదంపతులు సజీవ దహనం

కారు మంట్లో సజీవదహనమైన దంపతులు

కారు మంట్లో సజీవదహనమైన దంపతులు

Couple Found Dead : కొత్తూరులో మంటల్లో కాలిపోతున్న కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. తాము ఘటనా స్థలానికి కారులోని ఇద్దరు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు.

Couple found charred to death in burning car : కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో విషాద ఘటన చోటు చేసుకుంది .కారులో మంటలు చెలరేగి నవ దంపతులు సజీవ దహనమయ్యారు. హెగ్గుంజే గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను బెంగళూరుకి చెందినవారుగా గుర్తించారు. అయితే ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది

పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరు​కు చెందిన దంపతులు యశ్వంత్​(23), జ్యోతి(23) మే 18న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు జ్యోతి తన కుటుంబ సభ్యులతో తెలిపింది. తరగతులకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు యశ్వంత్​ చెప్పారు. ఇంటికి తిరిగి రాలేదు. దీంతో హెబ్బల్​ పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు. శనివారం వీరు మంగళూరులోని హుస్సేన్ అనే వ్యక్తి వద్ద ఓ కారుని అద్దెకు తీసుకున్నారు.

ALSO READ  Shocking : ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకుందామన్నాడని ప్రియుడిని దారుణంగా చంపి బావిలో పడేసిన ప్రియురాలు!

అయితే ఆదివారం తెల్లవారుజామున ఉడుపి జిల్లాలోని హెగ్గుంజే గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరులో మంటల్లో కాలిపోతున్న కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. తాము ఘటనా స్థలానికి కారులోని ఇద్దరు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. తమ జీవితాలను ముగిస్తున్నామని వారి తల్లిదండ్రులకు సందేశం పంపించారని తెలిపారు. అయితే, వారి మరణానికి గల అసలు కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నట్లు చెప్పారు. మృతదేహలను పోస్టుమార్టం కోసం మణిపలోని కస్తూర్బా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

First published:

Tags: Car fire, Karnataka

ఉత్తమ కథలు