ఓ వ్యక్తి గర్ల్ఫ్రెండ్తో కలిసి కొంతకాలంగా జీవనం సాగిస్తున్నాడు. అయితే సడన్గా ఇంటికి వచ్చిన భార్య.. బెడ్రూమ్లో మరో మహిళ ఉండటం చూసి షాక్ తింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన జార్ఖండ్లో చోటుచేసుకుంది. అభయ్ కుమార్ సిన్హా అనే వ్యక్తి దాల్టోన్గంజ్ రైల్వే స్టేషన్లో సీనియర్ పీడబ్ల్యూఐ అధికారిగా ఉన్నాడు. అయితే అతనికి భార్యతో కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అభయ్ కుమార్ సిన్హా భార్య.. పిల్లలతో కలిసి రామ్గఢ్ో నివాసం ఉంటుంది. మరోవైపు అభయ్ కుమార్.. ప్రభుత్వ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. అతనితో పాటు మరో మహిళ కూడా ఉంటుంది. ఇక, కొద్ది రోజుల క్రితం.. అభయ్ కుమార్ భార్య.. భర్త ఉంటున్న చోటుకు వచ్చింది.
ఆ సమయంలో భర్త బెడ్రూమ్లో మరో మహిళ ఉండటం చూసిన ఆమె తీవ్ర ఆవేశానికి లోనైంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే అభయ్ కుమార్ మాత్రం.. తన ఫ్రెండ్ కొన్ని పర్సనల్ పనుల వల్ల తన రూమ్లో ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. దీనిని తన భర్త తప్పుగా అర్థం చేసుకుందని తెలిపాడు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అభయ్ కుమార్ భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక, అభయ్ కుమార్ భార్య.. తన భర్తతో ఉన్న మరో మహిళతో గొడవ పడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక, వివాహేతర సంబంధాలు.. భార్యాభర్తల మధ్య విబేధాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఇవి.. భార్య,భర్తల వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా, వారి పిల్లల జీవితాలపై కూడా పెను ప్రభావాన్ని చూపుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Jharkhand