వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టడంతో పాటు మనుషుల ప్రాణాలు తీసేంతవరకు వెళుతున్నాయి. తన వివాహేతర సంబంధానికి తరచూ అడ్డు చెబుతున్నాడని భర్తపై ఆగ్రహం పెంచుకున్న ఓ మహిళ.. ఏకంగా అతడిని హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాస్ చౌదరికి 9 సంవత్సరాల కింద సరిత అనే మహిళతో వివాహమైంది. వీరికి ఏడు సంవత్సరాల కూతురు కూడా ఉంది. సరితకు అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం శ్రీనివాస్ కు తెలిసి భార్యను ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. భార్య ప్రవర్తన నచ్చని శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ భార్యభర్తలకు గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి భర్త తాగి రావడంతో సరిత అతనితో గొడవపడింది. మద్యం మత్తులో ఉన్న అతని పై పప్పు కాడతో తలపై కొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
అనంతరం శ్రీనివాస్ శవాన్ని చెట్టుకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రియుడు ప్రభాకర్తో కలిసి కోడలు సరిత తన కుమారుడిని హత్య చేసిందని శ్రీనివాస్ తండ్రి రామచంద్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు తమదైన శైలిలో నిందితులను విచారించి అసలు విషయం రాబట్టారు. ప్రస్తుతం ఆ నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.