హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

శ్రీ రామనవమి రోజు షాకింగ్ ఘటన.. ఆలయంలో భీకర కాల్పులు.. అసలేం జరిగిందంటే..

శ్రీ రామనవమి రోజు షాకింగ్ ఘటన.. ఆలయంలో భీకర కాల్పులు.. అసలేం జరిగిందంటే..

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలింపు

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలింపు

Uttar Pradesh: చిత్రకూట్‌లో రామనవమి సందర్భంగా భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆలయంలో భక్తులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో దూరంగా పారిపోయారు.

  • Local18
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  చిత్రకూట్‌లో శ్రీ రామనవమి (Sriramanavami) సందర్భంగా భక్తులంతా రాముడి దర్శనానికి వచ్చారు. పెద్ద ఎత్తున ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో... ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ గన్ పట్టుకుని ఇష్టమోచ్చినట్లు కాల్పులకు (Gun firing)  తెగబడ్డారు. దీంతో అక్కడ ఏంజరుగుతుందో తెలియక భక్తులు పరుగులు పెట్టారు.

ఈ కాల్పులలో ఒక భక్తుడికి బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి నిముషాల వ్యవధిలో పారిపోయారు. గాయపడిని వ్యక్తిని స్థానికులు ప్రయాగ్‌రాజ్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటన నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని కలుపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రామ నవమి పండుగ సందర్భంగా ఇక్కడ భారీ కాల్పులు జరిగాయి. ఇందులో మాజీ ప్ర‌ధాని కుమారుడితో పాటు ఇద్ద‌రి కాలికి బుల్లెట్ త‌గిలింది. కలపూర్ గ్రామంలోని ద్వారకాధీశుడి ఆలయంలో రామజన్మోత్సవం నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ఇంతలో, మాజీ హెడ్ అశోక్ త్రిపాఠి తన లైసెన్స్ రైఫిల్‌ను తీసుకువచ్చాడు. ఈ రైఫిల్‌తో హోరాహోరీగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. గ్రామానికి చెందిన జగేశ్వర్ ప్రసాద్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. అతని కాళ్లనుంచి రక్తం ధారంగా కారినట్లు సమాచారం. మరో వ్యక్తి కూడా కాల్పులలో గాయపడినట్లు తెలుస్తోంది.

రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు

ఇద్దరినీ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స తర్వాత వైద్యులు ప్రయాగ్‌రాజ్‌కు రెఫర్ చేశారు. మాజీ హెడ్ అశోక్ రైఫిల్ నుంచి కాల్పులకు తెగపడ్డారని స్థానికులు చెప్పారు. అకస్మాత్తుగా ఫైరింగ్ లో అక్కడ మంటలు కూడా చెలరేగాయని కొందరు తెలిపారు. పోలీసులు రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విచారణలో ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి సీఓ పాండే తెలిపారు.

First published:

Tags: Crime news, Gun fire, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు