ఉన్నత పదవికి తండ్రి మరోసారి ప్రమాణం చేసిన కొద్ది గంటలకే కొడుకు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కుమారుడి కారుకు ప్రమాదం జరిగింది. డిప్యూటీ సీఎం కొడుకు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. యూపీలో సీఎం యోగి తర్వాతత నంబర్ 2గా భావించే కేశవ్ ప్రసాద్ మౌర్య కుటుంబానికి ఇలా జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది..
యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కుమారుడు యోగేష్ కుమార్ మౌర్య ప్రయాణిస్తున్న వాహనం శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురైంది. జలౌన్ జిల్లా ఆలంపూర్ బైపాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. యోగేష్ మౌర్య ప్రయాణిస్తున్న కారు వేగంగా దూసుకెళ్లి ఓ ట్రాక్టర్ను ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.
డిప్యూటీ సీఎం కొడుకు కారు ప్రమాదానికి గురైన వెంటనే పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో యోగేష్ మౌర్య, అతనితోపాటుకారులో ప్రయాణిస్తోన్నవారికి పెద్ద గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. యూపీ డిప్యూటీ సీఎంగా కేశవ్ ప్రసాద్ మౌర్య శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.