ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది కీలక ఘట్టం. ఆ పెళ్లితోనే భార్యాభర్తలు బంధం అనేది బలపడుతుంది. జీవితంలో ఒక కీలక మలపుకు నాందిగా పెళ్లి నిలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరినొకరు విడిపోకుండా కలిసే ఉంటారు. పెళ్లి తరువాత.. దంపతుల మధ్య సాన్నిహిత్యం, శారీరక సంబంధమే వారి బంధాన్ని మరింత ధృడపరుస్తుంది. అలాంటిది పెళ్లై రెండు నెలలు అవుతున్నా ఇంత వరకు భార్య, భర్తల మధ్య కనీస సాన్నిహిత్యం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటూ.. ఒకరికొకరు కలుసుకోకుండా, శారీరక సంబంధం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి పరిస్థితి ఓ వ్యక్తికి ఎదురైంది. పెళ్లి జరిగినా ఇంతవరకు అతడికి సుఖం లేకుండా పోయింది. ఏనాడు తన భార్య దగ్గరకు రానియ్యలేదు. దగ్గరకు వచ్చిన ప్రతీ సారి ఏదో ఒక సమాధానం చెబుతూ దాటవేస్తూ వస్తోంది. చివరికి అసలు విషయం తెలుసి బిత్తరపోయాడు. తన భార్య కాపురానికి సెట్ కాదని గ్రహించి షాక్ అయ్యాడు. తనన మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరానికి చెందిన యువకుడికి, శాస్త్రినగర్లోని పంకి ప్రాంతానికి చెందిన యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఏప్రిల్ 28వ తేదీన వీరి వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్నాక భార్యా భర్తల మధ్య శారీరక సంబంధం సాధారణం. అయితే, ఆ యువతి మాత్రం తన భర్తను కనీసం దగ్గరకు కూడా రానీయలేదు. ఏకంగా రెండు నెలల పాటు ఆమె తాకనివ్వకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు.
అతని భార్యను పరీక్షించిన వైద్యులు.. ఆమె హిజ్రా అని తేల్చారు. అదే విషయాన్ని భర్తకు తెలియజేశారు. దాంతో అతను షాక్ అయ్యాడు. తనను మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. లింగ మార్పిడి చేసి అమ్మాయి అని చెప్పి తనతో వివాహం జరిపించారంటూ భార్య తరఫు బంధువులపై కేసు పెట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. అతని అత్తమామలతో పాటు ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love affair, Marriage, Police station, Wife and husband