కామాంధులు ఆడపిల్ల బయట ఒంటరిగా కనిపిస్తే వదిలిపెట్టడం లేదు. వావివరుసలు మరిచి మరీ ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒంటిరి మహిళలు ఏకాంతంగా ఉన్న ఫొటోలను , వీడియోలను సీక్రెట్ గా తీసి.. బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో సదరు బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా జరిగిన ఘటనలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువతిపై ఇద్దరు మృగాళ్లు దారుణానికి పాల్పడ్డారు. ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆపై అక్కడ జరిగే వాటిని తన ఫోన్ కెమెరాలో ఫొటోలు, వీడియోలు తీశారు. వీటిని ఆమెకు కాబోయే భర్తకు పంపించారు. ఈ విషయం కాస్త అమ్మాయి తల్లిదండ్రులకు తెలవడంతో ఈ పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ ఘటన గురించి పూర్తి వివరాలను వెల్లడించారు. అవి ఇలా ఉన్నాయి.
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్కి చెందిన 20 ఏళ్ల యువతి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె దినసరి కూలీ చేయడానికి ప్రతీ రోజు మహబూబ్నగర్కు వచ్చి వెళ్తుండేది. రాజేందర్ రెడ్డి అనే యువకుడు మల్కాపూర్ లో నివాసం ఉంటుంన్నాడు. అతడికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది. కొత్లాపూర్ అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అతడు పెయింటింగ్ పని చేస్తుండేవాడు. ప్రస్తుతం అతడి భార్య తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. దీంతో అతడు కూడా కొత్లాపూర్ లో ఉంటూ.. మహబూబ్ నగర్ వెళ్లి పెయింటింగ్ వర్క్ చేసుకొని మళ్లీ బైక్ పై కొత్లాపూర్ వస్తుండేవాడు. ఇలా ప్రతీ రోజూ అతడి జీవనం సాగేది.
ఓ రోజు పట్టణంలోనే దినసరి కూలీగా పనిచేసే ఆ 20 ఏళ్ల అమ్మాయి పరిచయం అయింది. ఆమెది కూడా కొత్లాపూర్ కావడంతో బైక్ పై రోజూ ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 5 న ఆమెకు ఎప్పుడూ వెళ్లే ప్రదేశం టీడీగుట్ట గేటు వద్ద పని దొరకలేదు. ఆమె వద్దకు రాజేందర్ రెడ్డి మరియు అతడి స్నేహితుడు ఆంజనేయులు బైక్ పై వచ్చి.. వేరే చోటు పని ఉంది.. చూపిస్తాం మాతో రా అంటూ ఆమెను బైక్ పై ఎక్కించుకున్నారు.
అక్కడ నుంచి ఆ యువతిని ఫతేపూర్ అడవిలోకి తీసుకెళ్లారు. ఆమెకు బవంతంగా మద్యం తాగించి.. లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేస్తూ.. ఫొటోలు, వీడియోలు తీశారు. ఆమెకు ఈ నెల 18 న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఫొటోలు, వీడియోలను సదరు పెళ్లికొడుకు వాట్సాప్కు పంపారు. అవి చూసిన సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. వెంటనే అమ్మాయి తరఫు తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.
దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయితో పాటు వాళ్ల తల్లిదండ్రులు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్లిద్దరిని అరెస్టె చేశారు. దీనిపై దర్యాప్తు చేపడుతామని వన్టౌన్ సీఐ రాజేశ్వర్గౌడ్ తెలిపారు. ఎన్ని చట్టాలు వచ్చినా ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట పడటం లేదని.. కఠిన చట్టాలను అమలు చేయాలని మహిళలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Mahabubnagar