TWO MAOIST MILITIA MEMBERS ARRESTED BY POLICE AT KOTHAGUDEM VB KMM
Maoists: ఇద్దరు మావోయిస్ట్ మిలీషియా సభ్యుల అరెస్టు.. వివరాలు వెల్లడించిన పోలీసులు..
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
Maoists: నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ జేగురుగొండ ఏరియా కమిటీకి అనుబంధంగా పనిచేస్తూ మిలీషియా కమిటీలో పని చేస్తున్న ఇద్దరు సభ్యులను చండ్రుగొండ పోలీసులు అరెస్టు చేసినట్లుగా కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు వెల్లడించారు.
(జి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్18 తెలుగు)
నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ జేగురుగొండ ఏరియా కమిటీకి అనుబంధంగా పనిచేస్తూ మిలీషియా కమిటీలో పని చేస్తున్న ఇద్దరు సభ్యులను చండ్రుగొండ పోలీసులు అరెస్టు చేసినట్లుగా కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు వెల్లడించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోకలగూడెం గ్రామశివార్లలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం వారిని విచారించగా మావోయిస్టు మిలీషియా కమిటీ సభ్యులుగా తెలిసిందని వెల్లడించారు. పట్టుబడిన ఇద్దరు మావోయిస్ట్ మిలీషియా సభ్యుల వివరాల వివరాలు ఇలా ఉన్నాయి.
బీజాపూర్ జిల్లా తెర్రం గ్రామానికి చెందిన హేమ్లా పాండు కొడకు హేమ్లా ఐతు(24), ఏడూళ్ల బయ్యారం కు చెందిన బడిసె చందు(27) గా పేర్కొన్నారు. వీరిరువురు మరికొంతమంది మిలిషియా సభ్యులతో కలిసి వారి కమాండర్ ఊకె కైలాష్ ఆదేశాల మేరకు మిలీషియా కమిటీలో పని చేస్తున్నట్లు వెల్లడించారు.
వీరి వద్ద నుండి 08 కేజీల బరువున్న కార్డక్స్ వైరును, 35 డిటోనేటర్లను, 50 కరపత్రాలను మరియు విప్లవ సాహిత్య పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. పట్టుబడిన వీరిరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.