(Balakrishna, News18, Hyderabad)గత కొద్ది రోజులుగా లోన్ యాప్ (Loan Apps) ల ఆగడాలను మితిమీరిపోతున్నాయి. తీసుకున్న లోన్ చెల్లించినప్పటికి ఇంకా లోన్ కట్టాలని బాధితులను బెధిరించి డబ్బులు వసూళు చేస్తున్నారు కేటుగాళ్లు. అయితే ఈ లోన్ యాప్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు నిజాం (Nizam) కాలంలో ఉపయోగించిన చట్టాన్ని ప్రయోగించడానికి రెడీ అవుతున్నారు. అదే చేమనీ లెండర్స్ యాక్ట్ (Money lender Act). మొదట నిజాంల పాలనలో రూపొందించబడిన ఈ చట్టం, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో ఆమోదించబడింది. మనీ లెండర్స్ యాక్ట్ను రాష్ట్రాలు కూడా కాబూలీవాలాలకు వ్యతిరేకంగా ఉపయోగించాయి, వారు ప్రధానంగా అధిక వడ్డీ వసూలు చేసిన పలువురు పహెల్వాన్లపై అప్పట్లో ఓల్డ్ సిటీలో మనీ లెండర్స్ యాక్ట్ను ఉపయోగించేవారిని చరిత్ర చెబుతుంది.
ప్రభుత్వం నుంచి లైసెన్స్..
ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, ప్రభుత్వం నుంచి లైసెన్స్ లేకుండా ఏ వ్యక్తి మనీ లెండింగ్ వ్యాపారం చేయకూడదు. ఇది ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానాతో కూడిన నేరం. ఇప్పుడు ఇదే చట్టాన్ని రుణ యాప్ కంపెనీలపై ప్రయోగిస్తున్నారు పోలీసులు. సైబరాబాద్ పోలీసులు ఐటీ చట్టం, క్రిమినల్ బెదిరింపు, మనీ లెండర్స్ యాక్ట్తో పాటు లోన్ యాప్స్పై మహిళలను కించపరిచే విధంగా వ్యవహారించడం వంటి నేరాలకు ఈ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు అంటున్నారు అధికారులు.
ఇదిలా ఉంటే ఇటీవల మాదాపూర్కు చెందిన 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆగస్టు 25న పోలీసులను ఆశ్రయించాడు. అప్పుగా తీసుకున్న మొత్తానికి 6 రెట్లు చెల్లించినప్పటికి, ఇప్పటికీ లోన్ యాప్ లు తనను వేధిస్తున్నాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో పోలీసులు నిజాం కాలంలో అమల్లో ఉన్న చట్టంను ఉపయోగించి కేసు నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రకారం, ఈ లోన్ యాప్ కంపెనీలలో చాలా వరకు నేరుగా చైనీస్ ఫండ్స్చే నియంత్రించబడుతున్నాయి.
CM KCR at Bihar: కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
"చైనీస్ ఫండ్స్ సహాకారంతో ఉన్న వివిధ ఫిన్టెక్ కంపెనీలు 7 రోజుల నుంచి 30 రోజుల వరకు తక్షణ వ్యక్తిగత రుణాలను అందించడానికి NBFCలతో ఒప్పందాలను కలిగి ఉండటంతో ఈ మార్కెట్ లో అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్నాయి. అధిక వడ్డీ రేటు తోపాటు ఈ యాప్ లు చాలా ఎక్కువ మొత్తంలో లేట్ ఫీ చార్జీలు కూడా వినియోగదారులకు విధిస్తున్నాయి. దీంతో ఫిన్టెక్ యాప్లు ఎక్కువ లాభాలను ఆర్జించగా, NBFCలు తమ లైసెన్స్ని ఉపయోగించుకునేందుకుగాను ఈ ఫిన్ టెక్ కంపెనీల నుంచి సర్వీస్ చార్జీలను వసూళు చేస్తాయి. ఈ యాప్ అన్ని వడ్డీ రేటు/ప్రాసెసింగ్ ఫీజు/ ప్లాట్ఫారమ్ ఫీజుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు చైనా తోపాటు హాంకాంగ్లోని ఆపరేటర్ల సూచనల మేరకు పనిచేస్తున్నట్లు ED విచారణ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber crimes, Hyderabad police, Loan apps