కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే కొంతమంది కరోనా వైరస్ పట్ల సరైన అవగాహన లేక మానసిక ఆందోళనతో వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది ఏకంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి హరియాణాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యకు కరోనా వైరస్ సోకిందని భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన ఓ వ్యక్తి(54) తనభార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే తాజాగా అతడి భార్యకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఉన్నట్టుండి ఆ వ్యక్తి గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం భార్యకు మాత్రమే కరోనా సోకిందా.. అతడికి సైతం కరోనా వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. పోస్టుమార్టానికి ముందు ఈ విషయం తేలుతుందని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Crime news, Haryana