మెదక్ జిల్లాలోని రామాయం పేట మండలం... లక్ష్మీపూర్ గ్రామంలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోజూ లాగే రైతు దాసరి పెద్ద ఎల్లయ్య పొలం పనులకు వెళ్లాడు. దూడకు గడ్డి వేద్దామని చూస్తే... అది చనిపోయి కనిపించింది. ఏదో జంతువు దాన్ని తినేసినట్లు కనిపించడంతో షాకయ్యాడు. దగ్గరకు వెళ్లి చూస్తే దూడ చుట్టూ పులి పంజా ముద్రలు కనిపించాయి. ఆయనకు చెమటలు పట్టాయి. ఒక్కసారిగా చుట్టూ చూశాడు. అక్కడెక్కడా పులి ఉన్నట్లు కనిపించలేదు. వెంటనే అటుగా పొలం పనులకు వెళ్తున్న వాళ్లను పిలిచి... విషయం చెప్పాడు. వాళ్లు కూడా కంగారు పడ్డారు. చివరకు అందరికీ విషయం అర్థమైంది. ఊళ్లోకి పులి వచ్చింది. పైగా అది దూడను తినేసిందంటే... చాలా ఆకలి మీద ఉందనీ, ఒకసారి వచ్చిన పులి మళ్లీ మళ్లీ వస్తుందని అనుకున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని పొలం గట్ల వైపు రాకుండా చూసుకోవాలని అందరూ చెప్పుకున్నారు. ఇలా పులి రాక... లక్ష్మీపూర్ గ్రామస్థులను తీవ్ర భయాందోళనల్లో పడేసింది.
అందరూ జాగ్రత్తగా ఉంటూ... పులి ఎవరికి కనిపించినా... అందరూ కలిసి దాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు. రాన్రానూ అడవులు తగ్గిపోతుండటం, ఉన్న కాస్త అడవుల్లో సరైన ఆహారం దొరక్కపోవడంతో... పులులు, క్రూర మృగాలూ... గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana News, Tiger Attack