దేశ రాజధాని ఢిల్లీ.. నేరాలకు కేరాఫ్ అడ్రెస్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. శ్రద్ధా వాకర్ హత్యతో అది మరోసారి నిరూపితం కాగా.. ఇప్పుడు అలాంటిదే మరో హత్య కేసు తెరపైకి వచ్చింది. ఇది కూడా సేమ్ అదే విధంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో కూడా ఓ వ్యక్తిని చంపి.. నరికి.. శరీర భాగాల్ని ఫ్రిజ్లో పెట్టారు. తూర్పు ఢిల్లీలోని పాండవ నగర్లో ఓ తల్లీ, కొడుకూ కలిసి ఈ ఘనకార్యం చేశారు. ఇది జరిగి ఏడెనిమిది నెలలైంది. మృతుడి శరీర భాగాల్ని అప్పుడప్పుడూ.. పాండవ్ నగర్లో, ఆ చుట్టుపక్కల పడేస్తూ ఉన్నారు. కానీ చేసిన నేరం బయట పడకుండా ఉంటుందా...
ఈ కేసులో మృతుడి పేరు అంజన్ దాస్. అతని భార్య, నిందితురాలి పేరు పూనమ్, కొడుకు పేరు దీపక్ అని తెలిసింది. పూనమ్.. అంజన్ దాస్కి నిద్రమాత్రలు ఇచ్చింది. నిద్ర మత్తులో ఉండగానే చంపేసింది. తర్వాత తల్లీ, కొడుకూ కలిసి.. అతని శరీరాన్ని చేపను కోసినట్లు చిన్న చిన్న ముక్కలుగా కోసి.. ఫ్రిజ్లో దాచారు. ఇదంతా.. త్రిలోకపురిలోని దాస్ ఇంట్లోనే జరిగింది.
Pandav Nagar murder | Delhi: Visuals of the residence of the accused where they kept the chopped-off body pieces of the victim in the refrigerator. https://t.co/qRSsepJPzq pic.twitter.com/UVNalvLdT9
— ANI (@ANI) November 28, 2022
తాజాగా :
పాండవ్ నగర్ ఏరియాలో.. పోలీస్ కుక్కలు ఏదో వాసన చూస్తుంటే.. పోలీసులు అక్కడికి వెళ్లారు. ఏవో మాంసం ముక్కల లాంటివి వారికి కనిపించాయి. వెంటనే శ్రద్ధావాకర్ వారికి గుర్తొచ్చింది. కుక్కల్ని వెనక్కి పంపి.. ఆ ముక్కల్ని సేకరించి.. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపగా.. అవి శ్రద్ధావాకర్వి కావనీ.. ఓ మగ వ్యక్తివి అని తెలిసింది.
పోలీసులకు మ్యాటర్ అర్థమైంది. మరో వ్యక్తిని ఎవరో చంపేశారని క్లారిటీ వచ్చింది. ఆ మాంసం ముక్కలు ఎవరివి? అక్కడ పారేసిందెవరు? అనేది తెలుసుకోవడానికి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ని గమనించారు. అర్థరాత్రివేళ దీపక్.. ఓ సంచితో అటుగా వెళ్లడం చూశారు. అతని వెనక అతని తల్లి కూడా వస్తుండటం ఫుటేజ్లో కనిపించింది. ఫుటేజ్ ఆధారంగా కేసును డీల్ చేయాలనుకున్న పోలీసులు.. ఆ చుట్టుపక్కల తల్లీ, కొడుకులు ఎవరెవరు ఉన్నారో గమనించారు. అలా.. అసలు నిందితులు ఎవరో తెలిసింది.
A woman along with her son arrested by Crime Branch in Delhi's Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch
(CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X — ANI (@ANI) November 28, 2022
ఎందుకు చంపింది?
అంజన్ దాస్కి వివాహేతర సంబంధం ఉంది. దీనిపై చాలాసార్లు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అప్పుడప్పుడూ ఇంటి ఓనర్.. అరుపులు మానమని వారికి చెప్పేవాడు. ఇదే విషయాన్ని అతను పోలీసులకు తాజాగా తెలిపాడు. ఆరేళ్లుగా వాళ్లు తన ఇంట్లో ఉంటున్నారనీ.. అంజన్ దాస్ మద్యం బాగా తాగుతాడని తెలిపాడు.
Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి...
ఎప్పుడు జరిగింది?
గత ఏడెనిమిది నెలలుగా అంజన్ దాస్ కనిపించట్లేదు. ఏమయ్యాడని భార్యను అడిగితే.. సొంతూరుకి వెళ్లాడని అందరికీ చెబుతూ వచ్చింది. ఇప్పుడు నిజం బట్టబయలైంది. పోలీసులు కేసు రాసి.. తల్లీ, కొడుకును అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కూడా.. శ్రద్ధావాకర్ హత్య జరిగిన సమయంలోనే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, Murder case