మధ్యప్రదేశ్లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జలసమాధి అయ్యారు. వివరాలు.. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని రాగోలి గ్రామంలో సోమవారం మధ్యహ్నం జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన తొమ్మిది మంది కారులో తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే వారు మహారజాపూర్కు చేరుకున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కారులో గాయాలతో ఉన్న మరో ముగ్గురిని బయటకు తీశారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్రేన్ సాయంతో కారును బావిలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టమ్కు తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Madhya Pradesh: 6 dead, 3 injured after the vehicle, they were travelling in, fell into a well in Maharajpur, Chhatarpur on Tuesday.
"A car, carrying 9 people of a marriage party, fell into a well last night, killing 6 of them," says Z Y Khan, Maharajpur Police Station In-charge pic.twitter.com/rZNi8REDl0
ఈ ఘటనపై మహారాజ్పైర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ జేవై ఖాన్ మాట్లాడుతూ.. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న కారు గత రాత్రి ప్రమాదానికి గురైందని చెప్పారు. ఆరుగురు చనిపోయినట్టు వెల్లడించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి విచారణజరుపుతున్నట్టు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.