టీవీ 9 సంస్థ వాటాల వివాదంలో కేసుల పాలైన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. అతని కోసం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయి. అధికారులు ఇచ్చిన నోటీసులకు రవిప్రకాశ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాలని పోలీసులు ముందుగా రవిప్రకాష్కు 160 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. వాటికి స్పందించక పోవడంతో 41సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతని కోసం గాలింపు తీవ్రతరం చేశారు.
అయితే ఈ వ్యవహారం మొత్తంపై రవిప్రకాష్ స్పందించారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటూ ఆయన ఆరోపించారు. తొలుత రవిప్రకాశ్ ఏపీలోని ఓ రిసార్టులో ఉన్నారనే సమాచారంతో కొద్దిరోజుల క్రితం అక్కడికి పోలీసులు వెళ్లారు. అయితే అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిన రవిప్రకాశ్..తర్వాత గుజరాత్ వెళ్లారనే సమాచారంతో అక్కడ కూడా తనిఖీలు చేశారు. తాజాగా రవిప్రకాశ్ మళ్లీ బెంగళూరుకే చేరుకున్నారనే సమాచారంతో ప్రత్యేక బృందాలు బెంగుళూరుకు వెళ్లాయి. రవిప్రకాశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కు హైకోర్టులో చుక్కెదురు కావడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Crime, Ravi prakash, Telangana, TV9