POLICE CEASED BANNED BHANG FOUND IN VISAKHAPARNAM PRN
Andhra Pradesh: మార్కెట్లోకి కొత్త చాక్లెట్లు.., తింటే ఏమవుతుందో తెలుసా..?
విశాఖపట్నంలో భంగ్ ను సీజ్ చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విశాఖలో (Visakhapatnam) నిషేధిత మత్తుపదార్థాలను రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోకి కొత్త చాక్లెట్లు వచ్చాయి. అవి తింటే తియ్యగా మాత్రం ఉండవ్.. మత్తుగా ఆపై గమ్మత్తుగా ఉంటాయి. కోల్ కతా, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నంకు ఈ మత్తు చాక్లెట్లు యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి. ప్రభుత్వం నిషేధం విధించిన గుట్కా, జర్దా, పాన్ మసాలతో పాటు భంగ్ పేరుతో మత్తు చాక్లెట్లను అక్రమార్కులు రవాణా చేస్తున్నారు. విశాఖ పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసి భారీగా భంగ్ చాక్లెట్లు, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లిపురం ప్రాంతంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. హరహర పాండా, మనోజ్కుమార్ చౌదరి, రాజీవ్ కుమార్ సింగ్లు వీటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నారు.
స్మగ్లర్ల కొత్త రూటు
సాధారణంగా నిత్యావసర సరుకులు, పండ్లు, వ్యవసాయ ఉత్పత్తుల మాటున గుట్కా, జర్దా, భంగ్ వంటి వాటిని స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తారు. ఈసారి పోలీసులకే దిమ్మతిరిగేలా లహరి మనుక్య ఆయుర్వేదం పేరిట మందుల డబ్బాల్లో భంగ్ చాక్లెట్లను ఉంచి సరఫరా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆయుర్వేదం మందుల పేరిట విక్రయిస్తున్నారు. ఐతే ఇలాంటి ఆయుర్వేద మందుల సంస్థ నిజంగా ఉందా లేదా అనే దానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శాస్త్రీయ సమాచారం కోసం వీటి శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత ఉత్పత్తులను ఆహార భద్రత అధికారులకు అప్పగించారు.
‘భంగ్’ తీసుకుంటే ఏమవుతుంది
భంగ్ ను ఎక్కువగా ఉత్తరాధి రాష్ట్రాల్లో మత్తుకోసం వినియోగిస్తారు. గుళికల రూపంలో వీటిని విక్రయిస్తారు. కొందరు దీనిని నేరుగా తీసుకుంటే మరికొందరు నీటిలో కలుపుకోని సేవిస్తారు. భంగ్ తీసుకున్నవారు కొన్ని గంటల పాటు మైకంలో ఉంటారు. డ్రగ్స్ మాదిరిగానే ఇది పనిచేస్తుంది. ఉత్తరాధి రాష్ట్రాల్లో దీని వినియోగం బహిరంగమే అయినా ఏపీలో మాత్రం దీనిపై నిషేధం ఉంది. దీంతో స్మగ్లర్లు సీక్రెట్ గా రవాణా చేస్తున్నారు.
స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం మోపడం, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటండంతో ఈజీగా రవాణా అయ్యే భంగ్ ను అక్రమార్కులు విశాఖ తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు దీనిని రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులను విచారించి వీటిని ఎక్కడెక్కడికి తరలిస్తున్నారో సమాచారం రాబట్టాలని పోలీసులు చూస్తున్నారు. వీటిని యువతను లక్ష్యంగా చేసుకొని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.