Nirbhaya Case | 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు (నిర్భయ కేసు)లో నలుగురు దోషులకు రేపు ఉరిశిక్ష అమలు కానుంది. ఉరి శిక్షను రద్దు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీలోని పాటియాలా కోర్టు కొట్టేసింది. దీంతో వారిని ఉరి తీయడం దాదాపు ఖాయమైంది. ఈనెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరితీయనున్నారు. ఉరికి మరికొన్ని గంటలే ఉందనగా, దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఇప్పుడు ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ఈ కేసులో నలుగురు దోషులు దేశ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని భారత్ - పాకిస్తాన్ సరిహద్దులకు పంపాలని, లేకపోతే భారత్ - చైనా సరిహద్దు అయిన డోక్లాంకు పంపాలని సూచించారు. అంతేకానీ, వారిని ఉరి తీయవద్దని కోరారు. ఈ మేరకు తాను అఫిడవిట్ ఫైల్ చేస్తానని ఏపీ సింగ్ ప్రకటించారు.
AP Singh, 2012 Delhi gangrape case convicts lawyer before Patiala House Court: Send them to Indo-Pak border, send them to Doklam, but don't hang them. They are ready to serve the country. I can file an affidavit in this regard. (file pic) pic.twitter.com/6FMSxcpn9e
— ANI (@ANI) March 19, 2020
ఈనెల 5వ తేదీన నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్ జారీ చేయడంతో ఏపీ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ల జారీ అనంతరం.. దోషుల తరపు లాయర్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులను ఇప్పటికే నాలుగు సార్లు చంపేశారని..ఇంకెన్ని సార్లు చంపుతారని కోర్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాభిక్ష పిటిషన్కు సంబంధించిన ఆర్టికల్ 72ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirbhaya, Nirbhaya case