నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో... ఏకంగా తన కుమారుడినే హత్య చేసింది ఓ తల్లి. తన ఎనిమిదేళ్ల కుమారుడు నాగరాజును అతడి తల్లి విజయ హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి కుమారుడు నాగరాజు గొంతును టవల్తో బిగించి చంపేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టింది. అయితే నాగరాజు మృతి అనుమాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజు హఠాత్తుగా చనిపోవడం గ్రామస్తుల అనుమానానికి కారణమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Nalgonda, Telangana