హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime News: హోటల్ గదిలో బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ఒకరు బీజేపీ లీడర్.. చివరకు ఏమైందంటే..

Crime News: హోటల్ గదిలో బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ఒకరు బీజేపీ లీడర్.. చివరకు ఏమైందంటే..

ముంబై వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళపై 8 మంది కీచకులు లైంగికదాడికి పాల్పడ్డారు. పుష్పక్ రైలు 

కంపార్టు మెంటులోకి 8మంది బలవంతంగా ప్రవేశించి కత్తులు చూపించి 20మంది ప్రయాణికులను 

దోచుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం

ముంబై వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళపై 8 మంది కీచకులు లైంగికదాడికి పాల్పడ్డారు. పుష్పక్ రైలు కంపార్టు మెంటులోకి 8మంది బలవంతంగా ప్రవేశించి కత్తులు చూపించి 20మంది ప్రయాణికులను దోచుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం

Crime News: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఒక మైనర్‌ బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఒకడైన బీజేపీ నేత సభ్వత్వాన్ని ఆ పార్టీ రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

దేశంలో ఎన్ని చట్టాలు(Laws) వచ్చినా మేము మారం.. మేమింతే.. మీరు ఏమైనా చేసుకోండి.. మా పని మేము చేసుకుంటాం అన్నట్లు తయారు అయ్యారు కామాంధులు. చిన్న లేదు పెద్దా లేదు.. ఎవరిని అయినా వారిపై అఘాయిత్యాలకు పాల్పడి ప్రాణాలను తీయడానికి సైతం వెనకాడం లేదు ఈ మృగాళ్లు. చిన్నపిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు కనికరం లేకుండా.. ఏ మాత్రం జాలి లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు విధించనా హత్యలు, ఆడవాళ్లపై యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మైనర్ బాలిక(Minor Girl)ను సామూహికంగా అత్యాచారం(Gang Rape) చేశారు ఓ ముగ్గురు కామాంధులు(Lustful). అందులో బీజేపీ లీడర్ మరొకరు జేడీయూ కార్యకర్త కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

High Court: మగవారికి శుభవార్త.. హైకోర్టు సంచలన తీర్పు.. పూర్తి వివరాలిలా..


హర్యానాకు చెందిన 17 ఏళ్ల బాలిక(girl) తన బంధువు పారుల్(Paurul) ఇంటికి వచ్చింది. వాళ్లు మధ్యప్రదేశ్(Madhyapradesh) లోని అశోకనగర్(Ashoknagar) లో నివాసం ఉంటున్నారు. ఒక రోజు పారుల్ తన స్నేహితులు ఎంపీ నగర్‌లోని ఒక హోటల్‌ లో పార్టీ చేసుకుంటుండగా.. ఆ బాలికను తీసుకెళ్లింది. ఆ హోటల్ లో వాళ్లు పార్టీలో మందు సేవించి ఎంజాయ్ చేస్తున్నారు.

అక్కడే ఉన్న మరో నలుగురు వ్యక్తులు ఆ బాలికను బలవంతంగా రూంకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి నిందితులు తెలియకపోవడంతో.. పోలీసులు సంఘటనా స్థలంలోని రికార్టు అయిన సీసీటీవీల ద్వరా నిందితులను గుర్తించారు. హోటల్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా డిండోరిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు భోపాల్‌ ఎస్పీ సాయి కృష్ణ తోట తెలిపారు.

Lovers: ఇద్ద‌రు ప్రేమించుకున్నారు.. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఎంత పని చేశారంటే..


భోపాల్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు గాను బిజెపి నాయకుడు మరియు జనతాదళ్ (యునైటెడ్) నాయకుడితో సహా మిగిలిన వ్యక్తులను దిండోరి జిల్లా నుండి అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితులను మనీష్ నాయక్, దినేష్ అవధియా మరియు అమిత్ సోనిగా గుర్తించారు. మనీష్ నాయక్ దిండోరి జిల్లా బిజెపి కార్యాలయ కార్యదర్శి కాగా, దినేష్ అవధియా డిండోరిలో జెడియు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు.

Crime News: ప్రేమించడం లేదంటూ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. ఎక్కడంటే..


నిందితుల్లో ఒకరైన దిండోరి బీజేపీ ఆఫీస్ ఇన్‌ఛార్జ్ మనీష్ నాయక్ ప్రాథమిక సభత్వాన్ని రద్దు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే.. వాళ్లను కూడా అరెస్టు చేసి విచారిస్తామని అన్నారు.

First published:

Tags: Crime, Crime news, Madhyapradesh

ఉత్తమ కథలు