Minor boy beaten : మహారాష్ట్ర(Maharashtra)లో అమానవీయ ఘటన జరిగింది. ఇనుప చువ్వలు దొంగలించాడనే అనుమానంతో 17 ఏళ్ల యువకుడిపై కర్కశత్వం ప్రదర్శించారు కార్మికులు. సిమెంట్-ఇసుక మిక్సింగ్ మిషన్ కి అతడి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టారు. ముంబ్రా మే 31న జరిగిన ఈ జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన యువకుడిని ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. మైనర్ బాలుడిని కార్మికులు మిక్సింగ్ మిషన్కు కట్టేసి కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నం సహా ఏడు సెక్షన్ల కింద ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని విచారణ బృందం అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరిచిన నిందితులకు జూన్ 10 వరకు పోలీసు కస్టడీ విధించారు. పోలీసులు మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు, ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) అమానవీయకర సంఘటన జరిగింది. పశువులను దొంగిలించాడని కేసుపై, బడాయున్ పోలీసులు రెహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో స్టేషన్ అధికారి,మిగతా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. లాఠీలతో కొడుతు, అతని ప్రైవేటు పార్ట్ లలో కుళ్లబొడిచాడు. అంతటితో ఆగకుండా, కరెంట్ షాక్ ఇచ్చారు. కాగా, బాధితుడిని చూడటానికి అతని బంధువులు వచ్చినప్పుడు ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది.
ALSO READ Pet dog : విశ్వాసం అంటే ఇదే మరి..యజమానిని రక్షించి ప్రాణాలు కోల్పోయిన కుక్క
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra