కొందరు స్నేహం, ప్రేమ పేరుతో అమ్మాయిలకు, మహిళలకు మాయమాటలు చెబుతుంటారు. ప్రేమిస్తున్నామని చెప్పి లొంగ తీసుకుంటారు. తమ అవసరాల కోసం అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతుంటారు. తమ కోరికలు తీర్చాలని తరచుగా వేధిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వివాహేతర సంబంధాలు కొన్నిసార్లు హత్యలకు దారితీస్తున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) షాకింగ్ ఘటన జరిగింది. యమునా ఖాదర్ అనే ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలిక విగత జీవిగా కన్పించింది. రిజ్వాన్ అలియాస్ బాద్షా అనే వ్యక్తి బీహర్ లో ఉండేవాడు. అతను ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వచ్చాడు. అతను అక్కడ.. తుర్క్ మన్ గేట్ వద్ద కసాయిగా పనిచేస్తున్నాడు. అయితే.. రిజ్వాన్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఆగస్టు తొలి వారంలో.. దర్యాగంజ్ లో ఉండే మహిళతో పరిచయం ఏర్పంది. ఆమెను తరచుగా కలుసుకునే వాడు. ఈ క్రమంలో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఒక రోజున ఇంట్లో ఉండగా, మహిళ కూతురు వీరినిచూసింది. బాలిక ఎవరికైన చెబుతుందోనని వీరు భయపడిపోయారు. ఈ క్రమంలో నిందితుడు.. రిజ్వాన్.. తెల్లవారు జామున బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమెను తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత.. ఏంతెలియదన్నట్లు వచ్చేశాడు. బాలికను తల్లి వెతికింది. చివరకు చెరువు ఉన్న ప్రాంతంలో బాలిక విగత జీవిగా ఉండటాన్ని కొంత మంది గమనించారు. ఆమె శరీరంపై దుస్తులు లేదు. అంతే కాకుండా ముఖం కూడా ఏర్పడకుండా ఎవరో.. పూర్తిగా ఛిద్రం చేసేశారు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు ప్రత్యేక పోలసులతో తనిఖీ చేపట్టారు. సీసీ కెమెరాలను జల్లేడ పట్టారు. నిందుతుడు బాలికను తీసుకెళ్తున్నట్లు రికార్డు అయ్యాయి. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేసి తమ దైన స్టైల్ లో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా ఒక మహిళ భర్తకు చుక్కలు చూపింది.
ఒడిశాలోని (Odisha) యూనివర్సీటిలో షాకింగ్ ఘటన జరిగింది. అనిల్ కుమార్ తిరియాగా బెర్హంపూర్ యూనివర్శీటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. శనివారం ఒక మహిళ అతను ఉన్న గదికి వెళ్లింది. డోర్ తీయగానే కోపంతో రెచ్చిపోయింది. వెంటనే చెప్పుతో అతగాడిని కొట్టడం ప్రారంభించింది. దీంతో గదిలో అరుపులు, కేకల విన్పిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడికి వెళ్లి చూశారు. కొందరు ఆ ఘటనను రికార్డు చేశారు. దానిలో ఒక మహిళ, ప్రొఫెసర్ అనిల్ కుమార్ ను పరిగెత్తించి మరీ చెప్పుతో కొడుతుంది.
దీంతో యూనివర్సీటీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు పదేపదే రిక్వెస్ట్ చేయడంతో ఎట్టకేలకు మహిళ మెయిన్ డోర్ ను తెరచింది. అయితే.. గొడవకు పాల్పడిన మహిళ, ప్రొఫెసర్ భార్య అని తెలుసుకుని అందరు షాక్ కు గురయ్యారు. ఇంట్లో కూర్చుని, మాట్లాడుకొవాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi