ఓ వింతతువుపై నలుగురు దుండగులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను రేప్ చేసి మర్మాంగాల్లో ఇనుప రాడు దుర్చారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని సీదీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. "బాధితురాలి భర్త నాలుగేళ్ల కిందట మహిళ భర్త మరణించారు. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలు, సోదరి ఒక గుడిసెలో నివసిస్తుంది. అక్కడే ఓ చిన్న షాపు నిర్వహిస్తుంది. అయితే నలుగురు వ్యక్తులు శనివారం రాత్రి మహిళ ఇంటికి వచ్చి నీరు ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో వారు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఆమెను రేప్ చేశారు. రేప్ చేసిన అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆమె మర్మాంగాల్లో ఇనుప రాడ్ దూర్చారు. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది"అని పోలీసులు తెలిపారు.
బాధితురాలిని తొలుత ఆటోరిక్షాలో అమాలియా పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి సీదీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను రేవాలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజ్కు షిప్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఆరోగ్యం గురించి డాక్టర్ కల్పనా యాదవ్ మాట్లాడుతూ.. "మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆమె మర్మాంగాల్లో అంతర్గతంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమెకు ఆపరేషన్ చేశాం. చికిత్స కొనసాగుతుంది"అని తెలిపారు.
ఈ ఘటనపై రేవా రేంజ్ ఐజీ ఉమేష్ జోగా మాట్లాడుతూ.. "బాధిత మహిళ కుటుం సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులు ఒకే గ్రామానికి చెందినవారు. వారిపై సంబంధింత సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుల్లో ఇద్దరిని లల్లు కోల్, భాయ్ లాల్ పటేల్గా గుర్తించాం" అని తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:January 11, 2021, 15:28 IST