హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime : భార్యపై అనుమాన భూతం..కిరాతకుడిగా మారిన భర్త

Crime : భార్యపై అనుమాన భూతం..కిరాతకుడిగా మారిన భర్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime : కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెనుభూతమైంది. ఇదే విషయంపై భార్యతో పలుమార్లు భర్త గొడవ పెట్టుకున్నాడు. నేను అలాంటిదాన్ని కాదు అంటూ మొత్తుకున్నప్పటికీ.. భర్తకు పట్టిన అనుమాన భూతం మాత్రం తగ్గలేదు.

కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెనుభూతమైంది. ఇదే విషయంపై భార్యతో పలుమార్లు భర్త గొడవ పెట్టుకున్నాడు. నేను అలాంటిదాన్ని కాదు అంటూ మొత్తుకున్నప్పటికీ.. భర్తకు పట్టిన అనుమాన భూతం మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో భార్య గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. భార్యపై అక్రమ సంబంధం అనుమానంతో ఓ భర్త రాక్షసునిగా మారాడు. ఆమెను గొంతు పిసికి బలిగొన్న దుర్ఘటన మైసూరు జిల్లాలోని హుణసూరు కల్కుణికె హోసింగ్‌ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. హతురాలు సౌమ్య కాగా, నిందితుడు రవి. వీరికి 11 ఏళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి గౌరవ్‌ (9), అకుల్‌ (7) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. సౌమ్య అంగన్ వాడీ వర్కర్ గా పనిచేస్తోంది. భార్య పైన ఇటీవల అనుమానం పెంచుకున్న రవి అనేకసార్లు ఆమెతో గొడవ పడ్డాడు. సౌమ్య నేను ఎటువంటి తప్పు చేయలేదని వాదించినా పట్టించుకోలేదు. ఒకటిరెండుసార్లు పోలీసుల వద్దకు వెళ్లగా రాజీ చేసి పంపారు.

రాజీలు చేసినా ..కానీ రవిలో అనుమాన భూతం పోలేదు. దీంతో నిద్రపోయిన సమయంలో రవి భార్య గొంతు పైన కాలుతో తొక్కి హత్య చేశాడు. ఆమె ఇంకా చనిపోలేదేమో అనే అనుమానంతో చున్నీని గొంతుకు బిగించి ఉరివేశాడు. తరువాత ఇంటి నుంచి పరారయ్యాడు. నిన్న ఉదయం ఎంతకు తలుపులు తీకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుణసురు పొలీసులు పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రంగనాథ లేఔట్‌లో దాక్కున్న కిరాతక భర్తను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోరంతో అభంశుభం తెలియని పిల్లలు అనాథలయ్యారు.

First published:

Tags: Crime, Crime news, Husband kill wife, Karnataka

ఉత్తమ కథలు