డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్రహీమ్..జీవిత కాలమంతా జైల్లోనే గడపనున్నారు. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో దోషులందరికీ పంచుకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. డేరాబాబాతో పాటు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్, క్రిశాన్ లాల్కు యావజ్జీగ కారాగార శిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పిచ్చింది. జర్నలిస్ట్ హత్య కేసులో జనవరి 11న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్తో పాటు మరో ముగ్గురిని దోషిగా తేల్చింది కోర్టు. తాజాగా వారికి జీవితఖైదు విధిస్తూ గురువారం సాయంత్రం తీర్పు వెలువరించింది.
తమ ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్షపడింది. ప్రస్తుతంన ఆయన హర్యానాలోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 25న గుర్మీత్ రామ్ రహీమ్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పురావడంతో పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో హింస చెలరేగింది. డేరా బాబా అనుచరులు, అభిమానులు ఆందోళనలతో పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఆ అల్లర్లలో 40 మందికిపైగా చనిపోయారు. ఉత్తరాదిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనలు జరగకుడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డేరాబాకు ఏకంగా యావజ్జీవ విక్ష విధించడంతో పంజాబ్, హర్యానాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అతడి అనుచరులు ఆందోళనలు, విధ్వంసానికి దిగే అవకాశముండడంతో భారీగా బలగాలను మోహరించారు. సిర్సా, సునారియా సహా హర్యానా, పంజాబ్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అసాంఘిక ఘటనలు జరగకుండా నిఘా పెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gurmeet Ram Rahim Singh, Haryana