హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం కావడం తీవ్ర కలకం రేపిన సంగతి తెలిసిందే. ముగ్గురు బాలికలు శనివారం ఉదయం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు విచారణలో ఈ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్వయంగా వారే ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వారు ఇంటి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలను సీసీటీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. కనిపించకుండా పోయిన బాలికల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ అవ్వడం తో ముగ్గరు కలిసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు.
ఇక, హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటున్న ఓ కుటుబానికి చెందిన.. 17 ఏళ్ల వయసున్న ఐశ్వర్య, 15 ఏళ్ల వయసున్న ఆస్మా, 14 ఏళ్ల వయసున్న అబీర్ లను ముగ్గురు కనిపింకుండా పోయారు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించిన ఈ ముగ్గురు.. శనివారం ఉదయం కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోవడానికి పెద్దమ్మాయి ఐశ్వర్య ప్రేమ వ్యవహారమే కారణమని అంతా అనుమానిస్తున్నారు.
Road Accident: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడిన ట్రక్.. 10 మంది భక్తుల మృతి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.