అతడో అమ్మాయిని ప్రేమించాడు. ఆ యువతికి కూడా అతడి ప్రేమలో పడింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఏమైందో ఏమే ప్రేమించిన అమ్మాయి.. అబ్బాయితో మాట్లాడటం మానేసింది. ఈ పరిస్థితి జీర్ణించుకోలేని ఆ యువకుడు.. అసలు విషయం తల్లితో చెప్పాడు. ఆమె లేకపోతే తాను లేనని.. పెళ్లికి ఒప్పించాలని కోరాడు. కొడుకు ప్రేమను అంగీకరించిన ఆ తల్లి.. నేరుగా అమ్మాయి ఇంటికెళ్లి ఆమె తల్లిదండ్రుతో మాట్లాడింది. కానీ వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ఫాతిమానగర్లోని మూడవ లైన్ కు చెందిన మోషే చక్రవర్తి.. స్థానికంగో ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయమేర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
కానీ ఏమైందో ఏమో.. సడన్ గా ఆయవుతి.. చక్రవర్తితో మాట్లాడటం మానేసింది. ఎంత ట్రై చేసినా ఆమె మాట్లాడకపోయే సరికి.. చిన్నబుచ్చుకున్నాడు. తన ప్రేమ విషయాన్ని తల్లితో చెప్పాడు. ఎలాగైనా ఆ యువతితో పెళ్లికి ఒప్పించాలని కోరాడు. కొడుకు ప్రేమను అంగీకరించిన ఆ తల్లి.. యువతికి ఇంటికెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఎప్పటిలాగే అమ్మాయి తల్లిదండ్రులు.. పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన చక్రవర్తి.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు సాగిస్తున్నారు.
రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కొప్పోలు గ్రామానికి చెందిన భవనం విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశ్వరకాలనీకి చెందిన నాగినేని ఇందుకి ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరింది. అయితే వీరి విషయం ఇళ్లల్లో తెలిసిందో, తల్లిదండ్రులు మందలించారో ఏమో కానీ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సోమవారం ఉదయం కాలేజీకి అని వెళ్లిన విష్ణు తిరిగి ఇంటికి రాలేదు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ బయటికి వెళ్లిన ఇందు మళ్లీ తిరిగి రాలేదు. రాత్రి ఇంటి నుంచి బయటకి వచ్చి ఇందు, విష్ణును కలిసింది. ఇద్దరూ కలిసి సోమవారం రాత్రే సూరారెడ్డి పాలేం రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లారు. నడుచుకుంటూ కాస్త ముందుకు వెళ్లి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం పూట ఈ దారుణాన్ని చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి దాటిన తర్వాతే వాళ్లు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి శరీర భాగాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు పంపించారు. యువతీయువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.