వారిద్దరూ ప్రేమికులు. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారిద్దరూ తనువు చాలించారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మొహాలిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన సాహిల్ కుమార్(22) మొహాలిలోని సెక్టార్ 66లో ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన ప్రగ్యా(26)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తకు ప్రేమకు దారి తీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరయ్యారు. వీరిద్దరూ ఒకే ప్రాంతంలో పెయింగ్ గెస్ట్గా ఉంటున్నారు. అయితే ఏమైందో ఏమోగానీ సాహిల్ కుమార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ మరుసటి రోజు ప్రియుడిని విడిచి ఉండలేక ప్రగ్యా సైతం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుమార్ ఆత్మహత్య సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఇందులో కుమార్ ఆత్మహత్య చేసుకునే సమయంలో ప్రగ్యా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana, Lovers suicide