హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG:ప్రియుడ్ని కొట్టారు..అతని కళ్ల ముందే ప్రియురాలిని..ఏం చేశారో ఈ వీడియో చూడండి

OMG:ప్రియుడ్ని కొట్టారు..అతని కళ్ల ముందే ప్రియురాలిని..ఏం చేశారో ఈ వీడియో చూడండి

Photo Credit:Youtube

Photo Credit:Youtube

OMG:యూపీలో 20రోజుల క్రితం ఓ దారుణ ఘటన జరిగింది. ప్రేమజంటపై దాడి చేసిన నలుగురు రౌడీలు..యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికి పట్టించుకోలేదు. దాడి, అత్యాచారం చేస్తున్న వీడియో బయటపడటంతో కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఇరవై రోజుల క్రితం ఓ దారుణమైన సంఘటన జరిగింది. ఓ యువతి, మరో యువకుడు మాట్లాడుకునేందుకు ఓ ప్రదేశంలో కలుసుకున్నారు. అయితే అదే ప్రాంతానికి నలుగురు కిరాతకులు(Four villains) ప్రేమజంటను చూసి పట్టుకున్నారు. ఇక్కడికి ఎందుకొచ్చారని మొదలుపెట్టి యువతి పక్కన ఉన్న కుర్రాడ్ని కొట్టారు(Beating). బెల్టుతో చావదాబాదారు. దుర్మార్గులు అంతటితో ఆగకుండా కుర్రాడి వెంట వచ్చిన యువతిని నలుగురు వ్యక్తులు బలవంతంగా అత్యాచారం(Physical torture) చేశారు. నిర్మాణుష్య ప్రదేశం కావడంతో యువతిని బెదిరించి బలత్కారం చేస్తుంటే అందులో ఒకడు వీడియో తీశాడు. యువతి ప్రియుడ్ని కొడుతున్న దృశ్యాలు రికార్డ్ చేశాడు. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రతాప్‌గఢ్‌(Pratapgarh)జిల్లాలో ఏప్రిల్‌ (April) 9వ తేదిన జరిగింది. ప్రేమజంటలోని యువకుడిపై దాడి చేసి..అటుపై యువతిని అత్యాచారం చేయడంతో బాధితురాలు పోలీసు (Police)లకు ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై కడాయి (Kadai)పోలీస్‌ స్టేషన్‌ (Police Station)కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. స్వయంగా బాధితురాలే తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

యూపీలో తెగించిన కిరాతకులు..

అయితే యువతిపై అత్యాచారం చేసి..ఆమె ప్రియుడ్ని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎవరు అప్‌లోడ్ చేశారో తెలియదు కాని..విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు అప్పటికప్పుడు చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు. మొదట దాడి చేసినట్లుగా కేసు పెట్టిన పోలీసులు తర్వాత అత్యాచారం, మరికొన్ని సెక్షన్లను చేర్చారు. విషయం తెలిసిన కొందరు యువతి అత్యాచారం కేసు గురించి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి ప్రశ్నిస్తుంటే ఏ ఒక్క పోలీస్ అధికారి నోరు మెదపడం లేదు.


ఓ యువతిని నలుగురు రౌడీలు సామూహిక అత్యాచారం చేశారన్న వార్త బాగా వైరల్ అయింది. బాధితురాలే స్వయంగా ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు, దోషుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదన్న విమర్శలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఇంత జరిగిన తర్వాత పోలీసులు సామూహిక అత్యాచారంతో పాటు దాడి కేసును దర్యాప్తు చేస్తున్నామని..నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెబుతున్నారు. స్థానికులు మాత్రం దోషుల్ని కాపాడేందుకు కడై పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కేసును నీరుగార్చాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్థానికులు మాత్రం యువతి, యువకుడిపై నలుగురు రౌడీలు చేసిన దాడి కడై పోలీసులకు తెలిసే జరిగిందని..వాళ్లను కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.  

First published:

Tags: Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు