హోమ్ /వార్తలు /క్రైమ్ /

రూ.3కోట్ల విలువైన విదేశీ మద్యం పట్టివేత.. ఎక్కడో తెలుసా..

రూ.3కోట్ల విలువైన విదేశీ మద్యం పట్టివేత.. ఎక్కడో తెలుసా..

గుర్జర్ రూ. 999,99,95,219కు బిడ్ దాఖలు చేశాడు. అదే సమయంలో మీనా రూ.999,99,90,216 బిడ్ దాఖలు చేశాడు. దీనికి సంబంధించి కొంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.  రూ.3 ఎక్కువ బిడ్ వేసిన గుర్జర్ కు ముందు అవకాశం ఇస్తారు. ఒకవేళ ఆయన విఫలం అయితే అప్పుడు చాన్స్ మీనాకు దక్కుతుంది. (ప్రతీకాత్మక చిత్రం )

గుర్జర్ రూ. 999,99,95,219కు బిడ్ దాఖలు చేశాడు. అదే సమయంలో మీనా రూ.999,99,90,216 బిడ్ దాఖలు చేశాడు. దీనికి సంబంధించి కొంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ.3 ఎక్కువ బిడ్ వేసిన గుర్జర్ కు ముందు అవకాశం ఇస్తారు. ఒకవేళ ఆయన విఫలం అయితే అప్పుడు చాన్స్ మీనాకు దక్కుతుంది. (ప్రతీకాత్మక చిత్రం )

అక్కడి వాహనాల్లో భారీగా విదేశీ మద్యం వెలుగుచూసింది. ఆ వాహనాల్లో 5200 బాక్సుల్లో 62,400 మద్యం బాటిళ్లను పంజాబ్‌లోని డేరాబాసి ప్రాంతం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

అది హరియాణాలోని ముర్తాల్ ప్రాంతం. ఐదారు వాహనాలు ఢిల్లీ వైపుగా ప్రయాణం సాగిస్తున్నాయి. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకుని ఆ వాహనాలు ఆపి తనిఖీలు చేశారు. అందులోని సరుకును చూసి పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో ఉన్న సరుకు మరేంటో కాదు. విదేశీ మద్యం బాటిళ్లు. ఒక్కటీ రెండు కాదండోయ్.. అక్షరాల 62,400 బాటిళ్లు. దాని విలువ సుమారు రూ.3కోట్ల పైమాటే. పూర్తి వివరాల్లోకి వెళితే.. హరియాణాలోని ముర్తాల్ ప్రాంతం నుంచి విదేశీ మద్యం పెద్ద ఎత్తున అక్రమ రవాణ చేస్తున్నారంటూ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందానికి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముర్తాల్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే సమీపంలోని ఓ ధాబా వద్ద ఉన్న వాహనాలను తనిఖీ చేశారు. అక్కడి వాహనాల్లో భారీగా విదేశీ మద్యం వెలుగుచూసింది.

ఆ వాహనాల్లో 5200 బాక్సుల్లో 62,400 మద్యం బాటిళ్లను పంజాబ్‌లోని డేరాబాసి ప్రాంతం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఆ పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని అధికారికంగా ధ్రువీకరించారు. ఇదేవిధంగా ఏప్రిల్ 18న రెండు ట్రక్కుల్లో అక్రమంగా తరలిస్తున్న 12వేల విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Alcohol, Haryana, Liquor, Lockdown

ఉత్తమ కథలు