హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking Incident: అమానుష ఘటన.. హోం వర్క్ చేయలేదని టీచర్ చావబాదితే పిల్లాడి ప్రాణం పోయింది..

Shocking Incident: అమానుష ఘటన.. హోం వర్క్ చేయలేదని టీచర్ చావబాదితే పిల్లాడి ప్రాణం పోయింది..

టీచర్ మనోజ్ కుమార్, బాధిత విద్యార్థి గణేష్ (ఫైల్ ఫొటో)

టీచర్ మనోజ్ కుమార్, బాధిత విద్యార్థి గణేష్ (ఫైల్ ఫొటో)

రాజస్థాన్‌లోని చురులో అమానుష ఘటన జరిగింది. హోం వర్క్ చేయలేదన్న కారణంగా ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడిని టీచర్ విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ దెబ్బలు తాళలేక ఆ పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

చురు: రాజస్థాన్‌లోని చురులో అమానుష ఘటన జరిగింది. హోం వర్క్ చేయలేదన్న కారణంగా ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడిని టీచర్ విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ దెబ్బలు తాళలేక ఆ పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గ్రౌండ్‌లో పడేసి మరీ అమానుషంగా కొట్టడంతో ఆ బాలుడు విలవిలలాడిపోయాడు.

భయంతో గజగజా వణికిపోతూ.. ‘కొట్టొద్దు సార్.. కొట్టొద్దు సార్’ అని బతిమలాడాడు. అయినా ఆ టీచర్ మనసు కరగలేదు. చేతిలో బెత్తం ఉంది కదా అని చావబాదాడు. ఆ పిల్లాడు దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లా సలసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోలసర్ అనే గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగింది.

ఇది కూడా చదవండి: Sad: ఆ మాటను పేపర్‌పై 200 సార్లు రాసింది.. ఇప్పుడు ఈ యువతి మన మధ్య లేదు.. ఏం జరిగిందంటే...

బాధిత విద్యార్థి పేరు గణేష్. చావబాదిన ఆ టీచర్ పేరు మనోజ్ కుమార్. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ ప్రైవేట్ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. టీచర్ మనోజ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. పోలీసులు ఆ కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Shameful Incident: ఈ అమ్మాయి చేసిన పనికి ఏమనాలి అసలు.. ఇంత నీచమైన ఆలోచన ఎలా వచ్చిందో...

ఆ స్కూల్‌కు 2003లో గుర్తింపు లభించినట్లు తెలిసింది. ఈ దారుణానికి పాల్పడిన టీచర్ మనోజ్ కుమారే ఆ స్కూల్‌కు హెడ్. గణేష్ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

First published:

Tags: Brutally murder, Crime news, Private teachers, Rajasthan, Student, Teacher misbehave

ఉత్తమ కథలు