news18-telugu
Updated: November 16, 2019, 2:08 PM IST
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ మాదాపూర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డునెంబర్ 36లో ఉన్న పబ్బులో మద్యం సేవించిన కొందరు విద్యార్థులు కారును ర్యాష్గా నడిపారు. దీంతో రోడ్డుపై ఉన్న క్రైన్ ఢీకొట్టి కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు పొగొట్టుకోగా మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఐశ్వర్య అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. మృతిచెందిన విద్యార్థి మనీష్గా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.
Published by:
Sulthana Begum Shaik
First published:
November 16, 2019, 1:55 PM IST