ఢిల్లీ పోలీసులు 40 ఏళ్ల కృష్ణదత్ తివారీని అరెస్టు చేశారు. టాక్సీ నడుపుతున్న అతను రెండు నెలల కాలంలో ఇద్దరు మైనర్ బాలికల్ని కిడ్నాప్ చేశాడు. అతనికి ఇద్దరు కొడుకులు. ఒకరి ఏజ్ 12 ఏళ్లు, మరొకరికి 14 ఏళ్లు. రెండు నెలల కిందట 8 నెలల ఓ బాలిక మిస్సింగ్ అయ్యింది. ఏమైపోయిందో, ఎవరు ఎత్తుకెళ్లారో పోలీసులకు అర్థం కాలేదు. రెండు వారాల కిందట మరో బాలిక మిస్సింగ్ అయ్యింది. తన వయసు కూడా 8 ఏళ్లే. ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు... ఓ చోట సీసీటీవీ ఫుటేజ్లో ఆధారాలు కనిపించాయి. పబ్లిక్ టాయిలెట్ నుంచీ బయటకు వస్తున్న బాలికను కారులో ఎత్తుకుపోయాడు కృష్ణదత్. కారు నెంబర్ ఆధారంగా... అతని అడ్రెస్ కనిపెట్టిన పోలీసులు... హడావుడిగా అతని ఇంటికి వెళ్లి చూశారు. షాకయ్యారు.
కిడ్నాప్ అయిన ఇద్దరు బాలికలూ ఆ ఇంట్లో కనిపించారు. వాళ్లు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు. వాళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా చక్కగా చూసుకుంటున్నాడు కృష్ణదత్. ఆశ్చర్యపోయిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి, బాలికల్ని తమ తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటరాగేషన్లో ఎందుకు కిడ్నాప్ చేశావ్ అని అడిగితే... కృష్ణదత్ చెప్పిన విషయం పోలీసుల్ని షాకయ్యేలా చేసింది.
బాలికలకు ఎలాంటి హానీ తలపెట్టలేదన్న పోలీసులు... అతని ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సమాజంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటున్నారనీ, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని సూచిస్తున్నారు.
Photos: పెళ్లిచూపులు బ్యూటీ రితూవర్మ లేటెస్ట్ ఫోటోస్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.