news18-telugu
Updated: May 17, 2020, 2:25 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశ రక్షణలో భాగస్వామ్యం అవుతూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఓ జవాను విచక్షణ కోల్పోయి తన భార్యా పిల్లలను చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వీకే యాదవ్ అనే సీఆర్పీఎఫ్ జవాను అలహాబాద్ సీఆర్పీఎఫ్ క్యాంపులో నివాసం ఉంటూ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ శనివారం ఉదయం తన భార్యతో పాటు కొడుకు, కూమార్తెను తుపాకీతో కాల్చి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, పారామిలిటరీ ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సదరు జవాను భార్యా పిల్లలను చంపిన తర్వాత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే వారిని ఎందుకు హత్య చేశాడనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
Published by:
Narsimha Badhini
First published:
May 17, 2020, 2:25 PM IST