ఇరాన్లో ఆత్మాహుతి దాడి... ముగ్గురు మృతి, 19 మందికి గాయాలు...
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా విరుచుకుపడిన వేర్పాటువాదులు... పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వచ్చి పేల్చివేత...
ఇరాన్లోని చాబహార్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దాడిలో ముగ్గురు చనిపోగా, దాదాపు 19 మందికి తీవ్ర గాయలయ్యాయి. సిస్టన్- బలుచిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో పాకిస్థాన్కు చెందిన బలూచీ వేర్పాటువాదులు, సున్నీ ముస్లింలు ఈ బాంబు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వేగంగా దూసుకొచ్చిన తీవ్రవాదులు... చాబహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో కారును ఆపగానే పేల్చివేశారని అధికారులు తెలిపారు.
మొదట ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పోలీసులు తెలిపినా... ఆ తర్వాత ఆ సంఖ్యను తగ్గించారు చాబహార్ సిటీ గవర్నర్ రెహంబెల్ బమేరీ. ‘చాబహార్ ప్రాంతంలో ఆత్మాహుతిదాడి జరిగింది. అత్యంత పేలుడు తీవ్రత కల్గిన పదార్థాలు ఉపయోగించడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చాలా అపార్ట్మెంట్స్ అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులు చనిపోయారు...’ అని పేర్కొన్నాడు బమేరీ. బాంబు దాడి జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో ఉన్న షాప్ యజమానులు, సామాన్యులు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్థాన్ సరిహద్దుకు 100 కి.మీ.ల దూరంలో ఉన్న చాబహార్ ప్రాంతంలో సున్నీ ముస్లింలు, బలూచీ కమ్యూనిటీ వారు వేల సంఖ్యలో నివసిస్తున్నారు. అయితే బలూచీ కమ్యూనిటీలు తమను పాకిస్థాన్లో విలీనం చేయాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య పెరిగింది. ఈ ప్రాంతంలోని గల్ఫ్ ఆఫ్ ఓమన్లో డీప్ వాటర్ పోర్ట్ ఉంది. భారత్ సాయంతో ఇరాన్ ఇక్కడ పవర్ అండ్ ఫ్రైట్ హబ్ డెవలప్ చేస్తోంది. దీంతో చాబహార్ ఏరియాను టార్గెట్ చేస్తూ దాడులను ప్రోత్సాహిస్తోంది పాకిస్తాన్.
మొదట ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పోలీసులు తెలిపినా... ఆ తర్వాత ఆ సంఖ్యను తగ్గించారు చాబహార్ సిటీ గవర్నర్ రెహంబెల్ బమేరీ. ‘చాబహార్ ప్రాంతంలో ఆత్మాహుతిదాడి జరిగింది. అత్యంత పేలుడు తీవ్రత కల్గిన పదార్థాలు ఉపయోగించడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చాలా అపార్ట్మెంట్స్ అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులు చనిపోయారు...’ అని పేర్కొన్నాడు బమేరీ. బాంబు దాడి జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో ఉన్న షాప్ యజమానులు, సామాన్యులు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్థాన్ సరిహద్దుకు 100 కి.మీ.ల దూరంలో ఉన్న చాబహార్ ప్రాంతంలో సున్నీ ముస్లింలు, బలూచీ కమ్యూనిటీ వారు వేల సంఖ్యలో నివసిస్తున్నారు. అయితే బలూచీ కమ్యూనిటీలు తమను పాకిస్థాన్లో విలీనం చేయాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య పెరిగింది. ఈ ప్రాంతంలోని గల్ఫ్ ఆఫ్ ఓమన్లో డీప్ వాటర్ పోర్ట్ ఉంది. భారత్ సాయంతో ఇరాన్ ఇక్కడ పవర్ అండ్ ఫ్రైట్ హబ్ డెవలప్ చేస్తోంది. దీంతో చాబహార్ ఏరియాను టార్గెట్ చేస్తూ దాడులను ప్రోత్సాహిస్తోంది పాకిస్తాన్.
కుక్కకు తాళి కట్టాడు... అది మగ కుక్క అని తెలిసేసరికి... చివరికి...
సొంత చెల్లెల్లిపై నెలలుగా అన్న అత్యాచారం... మగబిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక...
పది రూపాయల చీర కోసం వెళితే.. రూ.15వేల బంగారం పోయింది
మీ నిర్లక్ష్యం వల్లే అతని కాలు పోయింది... బాధితుడికి రూ.10 లక్షలు చెల్లించండి...
ఉద్యోగం పోయింది... ఆ ఫ్రస్టేషన్తో భార్యను బాత్రూమ్లోకి తీసుకెళ్లిన భర్త... దారుణంగా...
ఐదు రోజుల పాటు అత్యాచారం... ఐదు నెలల తరువాత దొరికిన అస్థిపంజరం
Loading...